ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ – 3 ఆరంభం అదిరిపోయింది. తొలి మ్యాచే అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన తొలి మ్యాచ్ లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్ పోరాడి ఓడింది. రెండు పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. విశాఖపట్నంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా.. 27-25తో తెలుగు టైటాన్స్ పై ఘన విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 12-8తో ఆధిక్యంలో ఉన్న ముంబా జట్టు.. ద్వితీయార్ధం ఆరంభంలో జోరు పెంచింది. ఒక దశలో 22-10 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో తెలుగు టైటాన్స్ రైడర్ సుకేశ్ హెగ్డే అద్భుతంగా ఆడాడు.
వెంటవెంటనే పాయింట్లు సాధించాడు. ఇక రాహుల్ చౌదరి కూడా స్థాయికి తగ్గట్లుగా ఆడటంతో... చివరి క్షణాల్లో తెలుగు జట్టు ముంబా స్కోర్ కు చేరువైంది. 27-24 ఆధిక్యంలో ఉన్న దశలో ముంబా జట్టు కొంత సమయం వృథా చేయడంతో పాటు పాయింట్లు ఇవ్వకుండా తెలివిగా ఆడి మ్యాచ్ చేజారకుండా చూసుకుంది. సుకేశ్ హెగ్డే 9 పాయింట్లు సాధించగా... రాహుల్ 6 పాయింట్లు తెచ్చాడు. డిఫెన్స్లో రాణించిన ధర్మరాజ్ 4 పాయింట్లు సాధించాడు. ముంబా తరఫున కెప్టెన్ అనూప్ 6 పాయింట్లు సాధించాడు. రిశాంక్ 7 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఇదే వేదికగా జరిగిన మరో మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ 35-29తో దబాంగ్ ఢిల్లీపై నెగ్గింది. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇద్దరూ మ్యాచ్ మొత్తం వీక్షించారు. ఇక తెలుగు టైటాన్స్ బ్రాండ్ అంబాసిడర్ దగ్గుబాటి రానా సందడి చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more