వన్డేల్లో చివరి వన్డే ఇచ్చిన కిక్కుతో తొలి టీ20లో మనవాళ్లు భేష్ అనిపించారు. ఆస్ట్రేలియాతో ఆడిలైడ్ లో జరుగిన తొలి టీ20లో గ్రాండ్ విక్టరీ సాధించారు. 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 151 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 19.2 ఓవర్లలోనే చాప చుట్టేసింది. 37 పరుగల తేడాతో రిపబ్లిక్ డే రోజు స్వీట్ విక్టరీ కొట్టింది ఇండియా. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా భారత్ ను మొదట బ్యాటింగ్ కు దించింది. భారతజట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు 19.3 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు టీ-20 మ్యాచ్ లసీరీస్ లో 1-0తో ఆధిక్యత సాధించింది.
భారతజట్టు ఇన్నింగ్స్ లో ఓపెనర్ రోహిత్ శర్మ మరో సారి రాణించాడు 20 బంతుల్లో 31 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 2 సిక్సర్లు, 9 బౌండ్రీలతో సాధించిన 90 పరుగులు భారత జట్టు విజయానికి బాటలు వేశాయి. సురేష్ రైనా 34 బంతుల్లో 1 సిక్సర్, 3 బౌండ్రీలతో 41 పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన ధోనీ 3 బంతుల్లో ఓసిక్సర్, ఓ బౌండ్రీతో 11 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా ఆరంభంలో మెరుపులు కురిపించినా,, వరుస వికెట్లను పోగొట్టుకుంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ చేసిన 44 పరుగులే అత్యధిక స్కోరు అయ్యాయి. వరుసగా వార్నర్ ( 17), స్మిత్ (21), హెడ్ (10) లేయాన్ 17, వాట్సన్ 12 చేశారు. బూమ్రా 3 వికెట్లు, అశ్విన్, హార్దిక్ పాండ్యా, జడేజా చెరి రెండు వికెట్ల తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more