ఆస్ట్రేలియాతో జరుగుతోన్న వన్డే సిరీస్లో ధోని సేన వరుసగా నాలుగో వన్డేలోనూ ఓటమి పాలై పాతన కథనే పునారావృతం చేసింది. దీంతో అతిధ్య జట్టు 4-0తో దూసుకుపోతుంది. కాన్బెరాలో జరిగిన నాలుగో వన్డేలో భారత్ టాప్ ఆర్డర్ ధాటిగా అడినా.. వారి తరువాత స్కోరు బోర్డును ముందుకు నడిపించడంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు విఫలమయ్యారు. ఇక చివరి వరుసలో నిలిచే బ్యాట్స్ మెన్లు అసీస్ బౌలర్ల ధాటికి వరుస విక్కెట్లను సమర్పించుకున్నారు. దీంతో నాల్గవ టెస్టులో ధోనిసేన పై ఆస్ట్రేలియా 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.
349 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌట్ అయింది. కోహ్లీ (106), ధావన్ (126) అద్బుతంగా రాణించి రెండో వికెట్కు 212 పరుగుల భాగస్వాయ్యం నమోదు చేసినప్పటికీ జట్టును మరో ఓటమి నుంచి తప్పించలేకపోయింది. జట్టు స్కోరు 277 పరుగుల వరకు భారత్ పటిష్టస్థితిలోనే ఉంది. కానీ, అదే స్కోరు వద్ద రెండు కీలక వికెట్లు కోల్పోవడం భారత్ను దెబ్బతీసింది. రిచర్డ్ సన్ ఐదు, హ్యాస్టింగ్స్, మిచెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, స్పిన్నర్ నాథన్ లియోన్కు ఒక వికెట్ దక్కింది.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కంగారూలు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 348 పరుగులు చేశారు. ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ (107) సెంచరీ చేయగా, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (93) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కెప్టెన్ స్మిత్ (29 బంతుల్లో 51) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ మార్ష్ 33 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో ఇషాంత్ 4, ఉమేష్ యాదవ్ 3 వికెట్లు, ధావన్, జడేజా చెరొక వికెట్లు తీసుకున్నారు. ఐదు వికెట్లు పడగొట్టిన రిచర్డ్ సన్ ను మ్యాచ్ అఫ్ ది మ్యాచ్ వరించింది. కాగా వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే దిశగా అసీస్ ఉవ్విళ్లూరుతుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more