ఉత్కంఠ భరితంగా సాగిన విజయ్ హజారే వన్డే ట్రోఫీ ఫైనల్ పోరులో ఢిల్లీపై గుజరాత్ విజయాన్ని సాధించి ఛాంఫియన్ గా నిలిచింది. కెప్టెన్ పార్థివ్ పటేల్ (105) సెంచరీకి తోడు.. యువ మీడియం పేసర్ జస్ప్రీత బుమ్రా (5/28), వెటరన్ బౌలర్ ఆర్పీ సింగ్ (4/42) విజృంభణతో.. ఫైనల్లో గుజరాత్ 139 పరుగుల భారీ తేడాతో ఢిల్లీపై విజయం సాధించి.. తొలిసారి టైటిల్ కైవసం చేసుకుంది. పార్థివ్ కెప్టెన్ ఇన్నింగ్స్తో పాటు, రుజుల్ భట్ (60) అర్ధ సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో గుజరాత 273 పరుగులకు ఆలౌటైంది. పంచాల్ (14), భార్గవ్ (5) నిరాశపర్చినా.. పార్థివ్-రుజుల్ మూడో వికెట్కు 149 పరుగులు జోడించి జట్టుకు భారీ స్కోరందించారు.
ఢిల్లీ బౌలర్లలో నవదీప్ సైనీ, సుబోత భాటి, పవన్ నేగి తలో 2 వికెట్లు తీశారు. ఇక లక్ష్య ఛేదనలో.. బుమ్రా, ఆర్పీ సింగ్ ధాటికి ఢిల్లీ 32.3 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ రిషబ్ (0), మిలింద్ కుమార్ (0) డకౌటవగా, మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (5), కెప్టెన్ గంభీర్ (9), మనన్ శర్మ (2) సింగిల్ డిజిట్కే పెవిలియన్ బాట పట్టారు. ఢిల్లీ 70 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకుంది. చివర్లో పవన్ నేగి (57) అర్ధ సెంచరీతో పోరాడినా ఓటమి తప్పించలేకపోయాడు. పార్థివ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
సంక్షిప్త స్కోర్లు:
గుజరాత్: 50 ఓవర్లలో 273 ఆలౌట్ (పార్థివ్ 105, రుజుల్ భట్ 60; నవదీప్ 2/46, పవన్ 2/36)
ఢిల్లీ: 32.3 ఓవర్లలో 134 ఆలౌట్ (పవన్ నేగి 57, ఉన్ముక్త్ చాంద్ 33; బుమ్రా 5/28, ఆర్పీ సింగ్ 4/42).
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more