టీమిండియా డాషింగ్ బ్యాట్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ మైదానంలో అడుగిడితే చాలు.. అభిమానులు ఈలలు, చప్పట్లతో ఆ ప్రదేశాన్ని ఊరేగింపులా చేసేవారు.. ఇక ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం ఇతని రాకతో కాస్త ఆందోళనకు గురయ్యేవారు. ముఖ్యంగా.. వీరూ ఎక్కడ తమ బౌలింగ్ లో వీరబాదుడు బాదుతాడేమోనన్న భయం బౌలర్లను వెంటాడేది. అటువంటి డేంజర్ క్రికెటర్ అయిన సెహ్వాగ్ తలరాత అంతలోనే మారిపోయింది. డ్యాషింగ్ స్థాయి నుంచి పూర్తిగా డౌన్ అయిపోయాడు. తిరిగి తన ప్రతిభను పుంజుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. దీంతో చేసేదేమీ లేక చేతులెత్తేసిన సెహ్వాగ్.. చివరికి రిటైర్ మెంట్ ప్రకటించేశాడు. కానీ.. తాను రిటైర్ మెంట్ ప్రకటించిన విధానం తనని తీవ్రంగా కలచివేసిందని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
నిజానికి.. ప్రతి క్రికెటర్ తాను ఆడుతున్న చివరి మ్యాచ్ ఇదేనని ముందుకు నిర్ణయించుకుని రిటైర్ మెంట్ ప్రకటిస్తారు. కానీ.. వీరూ విషయంలో అలా జరగలేదు. తనని టీమ్ నుంచి తీసేసినప్పటికీ.. తిరిగి అవకాశం లభిస్తుందని ఎంతో ఆశించాడు. అప్పుడు మ్యాచ్ సందర్భంగా తన రిటైర్ మెంట్ ప్రకటించి, ఎంతో ఆర్భాటంగా చివరి మ్యాచ్ ఆడాలని అనుకున్నాడు. అయితే.. వీరూ అనుకున్నట్లు జరగకపోగా.. టీమిండియాలో స్థానం లేని సమయంలోనే తీవ్ర మనోవేదనతో రిటైర్ మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. తనకింక జట్టులో స్థానం దక్కే అవకాశం లేదని తెలుసుకున్న వీరూ.. చివరికి రిటైర్ మెంట్ ప్రకటించడమే శరణ్యమని భావించి అలాగే చేశాడు. అదే తనని తీవ్రంగా కలచివేసిందని బాధపడుతున్నాడు ఈ మాజీ క్రికెటర్. తాను ఓ మ్యాచ్ ఆడుతూ క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించేందుకు సెలక్టర్లు అవకాశం ఇవ్వలేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
తానూ అందరి క్రికెటర్స్ లాగే చివరి మ్యాచ్ ఆడి క్రికెట్ కు గుడ్ బై చెప్పి వుండేవాడినని, వీడ్కోలు సమయంలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడి వుండేవాడినని అన్నాడు. కానీ.. తన తలరాత మరోలా వుందని మనస్తాపాన్ని వ్యక్తం చేశాడు. 2007లోనే జట్టు నుంచి స్థానం కోల్పోయినప్పుడు ఇక ఆడకూడదని భావించానని, కానీ సచిన్ ఒత్తిడి మేరకే అప్పట్లో రిటైర్ మెంట్ ప్రకటించలేదని అన్నాడు. ఆ సమయంలో తనను ఇక ఎంపిక చేసే ఉద్దేశం లేదని సెలక్టర్లు చెప్పివుంటే.. ఆ సిరీస్ నే తన ఆఖరి సిరీస్ అని చెప్పి.. ఆట నుంచి విరమణ ప్రకటించి వుండేవాడినంటూ వీరూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఏదేమైనా.. తాను రిటైర్ మెంట్ చేసిన విధానం తనను చాలా బాధించిందని ఆవేదనతో తెలిపాడు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more