శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతం జరిగింది. తొలి ఇన్నింగ్స్ లో ఇరగదీసిన కోహ్లీ సేన.. రెండో ఇన్నింగ్స్ కు వచ్చే సరికి వరుసగా పెవీలియన్ కు దారిపట్టారు. శ్రీలంకను వరించిన అదృష్టం అద్భుతం చేయడంతో ఇన్నింగ్ విజయం ఖాయమనుకున్న తరుణంలో చండీమాల్ అద్బుత ఇన్నింగ్ దానిని దూరం చేశాయి. రెండు రోజులు మిగిలి వుండటం, తొలి ఇన్నింగ్స్ లో బాగా రాణించడంతో.. స్వల్ప స్కోరు లక్ష్యంగా బరిలో దిగిన కోహ్లీ సేన అనూహ్యంగా ఓటమిని చవిచూసింది. నాల్గవ రోజు లంక బౌలర్ హేరత్ తనకు అనుకూలంగా మార్చుకుని భారత్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 63 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లంకేయులు విసిరిన 176 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా వరుస వికెట్లను కోల్పోయి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. టీమిండియా 112 పరుగులకే చాపచుట్టేయడంతో తొలి టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసింది. దీంతో కోహ్లీ నేతృత్వంలోని తొలి లంక పర్యటన పేలవంగా ఆరంభమైంది.
టీమిండియా ఆటగాళ్లలో అజింక్యా రహానే (36 ) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. టీమిండియా 23 /1 ఓవర్ నైట్ స్కోరు తో ఈరోజు ఆటను ప్రారంభించింది. శుక్రవారం కేఎల్ రాహుల్ (5) ను తొలి వికెట్ రూపంలో కోల్పోయిన టీమిండియా . శనివారం నైట్ వాచ్ మన్ ఇషాంత్ శర్మ(10) వికెట్ ను ఆదిలోనే చేజార్చుకుంది. ఇషాంత్ శర్మ వికెట్ కోల్పోయే సరికి టీమిండియా స్కోరు 30/2. అయితే ఆ తరువాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. టీమిండియా 67 పరుగులకే ఏడు వికెట్లు నష్టపోయి ఒక్కసారిగా కష్టాల్లో పడింది. టీమిండియా ఆటగాళ్లలో శిఖర్ ధావన్(28), రోహిత్ శర్మ(4), విరాట్ కోహ్లీ(3), సాహా(2), హర్భజన్ సింగ్(1),అశ్విన్ (3), అమిత్ మిశ్రా(15) లు పెవిలియన్ కు చేరడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. శ్రీలంక బౌలర్లలో హెరాత్ ఏడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. కౌశల్ మూడు వికెట్లు తీసి లంక విజయంలో సహకరించాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు సాధించగా, రెండో ఇన్నింగ్స్ లో 367 పరుగులు సాధించింది. టీమిండియా తోలి ఇన్నింగ్స్ లో 375మ పరుగులు సాధించగా, రెండో ఇన్నింగ్స్ లో 112 పరుగులకే అలౌట్ అయ్యి ఓటమిపాలైంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more