టీమిండియాతో జరగిని వన్డే సీరీస్ ను గెలుచుకోవడంతో పాటు తొలిసారిగా ఓ జట్టుపై సీరీస్ ను కైవసం చేసుకున్న ఆదిత్య జట్టు అద్బుత ప్రధర్శనను ప్రపంచ దేశాలు కోనియాడుతన్న నేపథ్యంలో.. మాసిన పాత గాయాన్ని మళ్లీ రేపారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మాజీ అద్యక్షుడు ముస్తఫా కమల్. ఈ ఏడాది జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో భారత్ బంగ్లాదేశ్ జట్ట మధ్య జరిగిన మ్యాచ్ లో భారత గెలుపు కేవలం అప్పటి ఐసిసి చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ చలువవేనని ఆయన వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ పై భారత్ గెలుపును నిర్ధేశించింది.. రచించింది మొత్తం ఎన్ శ్రీనివాసన్ నేనని ముస్తఫా కమల్ ఆరోపించారు.
ప్రపంచ కప్ లో భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వివాదాస్పదంకావడం తెలిసిందే. ఆ మ్యాచ్ లో కోన్ని అంఫైరింగ్ నిర్ణయాలు భారత్ కు అనుకూలంగా వచ్చాయని అరోపించడం ద్వారా కమల్ అప్పట్లోనే పెద్ద దుమారాన్ని లేపారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మళ్లీ అదే వివాదాన్ని తిరగదోడారు. ఆ క్వార్టర్ ఫైనల్ సమరంలో భారత్ విజయం వెనుక ఎన్ శ్రీనివాసన్ ఉన్నారని ఆరోపించారు. మ్యాచ్ ఫలితాన్ని ఆయనే ప్రభావితం చేశారని మండిపడ్డారు. భారత్ లో క్రికెట్ వ్యవస్థను నడిపించే ఆయనే, మెల్ బోర్న్ మ్యాచ్ లోనూ చక్రం తిప్పారని వివరించారు. ఇక బంగ్లాదేశ్ జట్టు తాజాగా భారత్ పై సిరీస్ నెగ్గడం పట్ల కమల్ హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వాత తమ దేశ క్రికెట్ జట్టు ప్రతిభను అర్థం చేసుకోవచ్చునని ఆయన పేర్కోన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more