బంగ్లాదేశ్ తో ఒక టెస్టు మూడు వన్డే మ్యాచ్ లతో చిన్న సీరీస్ కోసం బయలుదేరి వెళ్లిన టీమిండియా.. ఎలాగైనా బంగ్లాతో రేపటి నుంచి జరగనున్న టెస్టు మ్యాచ్ లో అధిపత్యం సాధించేందుకు సిద్దం అవుతోంది. ఇందుకోసం నిన్న ఢాకా చేరుకోగానే ఎలాంటి విశ్రాంతి లేకుండా నేరుగా స్థానికంగా గల షేర్ ఏ బంగ్లా క్రికెట్ స్టేడియంలో భారత్ క్రీడాకారులు చమటోడ్చారు. ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ వంటి జట్టును మట్టికరిపించి ఫ్లే ఆఫ్ కు చేరిన బంగ్లాను తక్కువగా అంచనా వేయరాని పలువురు ప్రముఖ క్రికెటర్లు సూచనలను పరిగణలోకి తీసుకున్న టీమిండియా జట్టు.. ఎలాగైనా టెస్టు మ్యాచ్ లో విజయం సాధించేందుకు కృత నిశ్చయంతో వుంది.
అటు టెస్టు కెప్టెన్ గా తనపై పూర్తి విశ్వాసాన్ని చూపిన భారత క్రికెట్ నియంత్రణ మండలి బిసిసిఐకి బంగ్లా టెస్టును గెలచి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇందుకోసం జట్టు సభ్యులను కూడా హుషారెత్తించేందుకు సిద్దమైన కోహ్లీ.. ఢాకాలో దిగిన వెనువెంటనే ప్రాక్టీసుకు సిద్దం అయ్యాడు. అటు జట్టు సభ్యులతో కూడా ఉల్లాసంగా హుషారెత్తించారు. అటు రెండేళ్ల తరువాత టీమిండియా టెస్టు జట్టులో స్థానం సంపాదించిన హాఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కూడా తన స్ఠానాన్ని పధిలం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన అందివచ్చిన బంగ్లాటెస్టు తో తన సత్తాను నిరూపించుకోవాలని ఉత్సాహపడుతున్నారు.
ఇటీవల తమకన్నా బలమైన దేశం పాకిస్థాన్ తో జరిగిన సీరీస్ లో తమ సత్తాను చాటిని బంగ్లాదేశ్.. అంతకు రెట్టింపు ఉత్సాహంతో టీమిండియాపై గెలుపుకోసం ప్రయాత్నలను ముమ్మరం చేసింది. సొంతగడ్డపై జరగనున్న పోరులో విజయాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తుంది. టెస్టు మ్యాచ్ పై పట్టుబిగిస్తే.. ఆ ఒత్తిడి వన్డే మ్యాచ్ లపై కూడా పడుతుందని, దీంతో వన్డేలను కూడా గెలుచుకునేందుకు ప్రణాళికలను రచిస్తోంది. అయితే బంగ్లాదేశ్, టీమిండియాల మధ్య రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏకైక టెస్టుకు ఫతుల్లాహ్ లోని ఖాన్ సాహెబ్ ఉస్మాన్ అలి స్టేడియం వేదిక కానుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more