ఐపీఎల్ ముగిసి ముగియగానే వచ్చే నెల ఆరంభంలో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు సిద్దం కానుంది. ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్న బిసిసిఐ.. ఇందుకోసం జట్టును రేపు బుధవారం ఎంపిక చేయనుంది. ప్రపంచ కఫ్ నుంచి తిరిగిరాగానే ఐపీఎల్ లో శ్రమించిన పలువురు సీనియర్లు.. బంగ్లాదేశ్ టూరుకు విముఖత వ్యక్తం చేశారు. భారత జట్టు సారధి మహేంద్రసింగ్ ధోణితో పాటు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రపంచ కప్ తరువాత తన బాల్యస్నేహితురాలిని పరిణయమాడిన సురేష్ రైనా.. త్వరలో పెళ్లి కోడుకు కాబోతున్న రోహిత్ శర్మ తదితరులు ఇప్పటికే తమకు బంగ్లా పర్యటన నుంచి మినహాయింపు కల్పించాలని బిసిసిఐని కోరినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. బుధవారం ముంబాయిలో జట్టను ఖరారు చేయనుంది. అయితే ఈ నలుగురి స్తానంలో టీమిండియా జట్టుకు దశాబ్దకాలం పాటు సేవలందించి.. రిటైర్మెంట్ అంచున నిలిచిన యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్బజన్ సింగ్, వీరేంద్ర సేహ్వాగ్ వంటి కీలకమైన ఆటగాళ్లకు వీడ్కోలు పలికేందుకు వారిని ఎంపిక చేయనున్నారా అన్న ఉత్కంఠకు రేపు బిసిసిఐ తేర తీయనుంది. కాగా ప్రస్తుతం వున్న టీమిండియా జట్టులో పెద్దగా మార్పులు లేకుండానే జట్టుకు ప్రకటించే అవకాశాలున్నాయని మరికోందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ ప్లేయర్లకు అవకాశం కల్పించి వారికి సముచిత గౌరవాన్ని పలుకుతారా..? లేక కొత్త యువరక్తం తో జట్టును ఎంపిక చేస్తారా అన్న విషయాలను వేచి చేడాల్సిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more