ఐపీఎల్-8లో భాగంగా ఇదివరకు జరిగిన మ్యాచులో వేరు.. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ వేరు! ఎందుకంటే.. ఈ మ్యాచ్ గెలిస్తేనే ముంబై ఇండియన్స్ కు ప్లే ఆఫ్స్ కు వెళ్లే ఆశలు సజీవమవుతాయి. అటు కోల్ కతా గెలిస్తే డైరెక్ట్ గా ప్లే ఆఫ్ కి వెళుతుంది. ఇలా రెండు జట్లు తమతమ ఆశలతో బరిలోకి దిగిన ఈ మ్యాచ్.. క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ముంబై సంచలనాత్మకంగా ఆడింది. తొలుత బ్యాటింగ్లో తడబడ్డా... యువ పాండ్యా వీరోచిత బ్యాటింగ్తో భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఓటమి అంచుల్లోంచి ఆఖరి ఓవర్లో పొలార్డ్ తన మ్యాజిక్ చేశాడు. ఫలితంగా ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుని.. కోల్కతానూ ఒత్తిడిలోకి నెట్టింది.
ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా గురువారం జరిగిన మ్యాచులో కోల్కతా నైట్రైడర్స్పై ముంబై ఐదు పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 171 పరుగులు చేసింది. కోల్కతా బౌలర్లు ప్రారంభంలో కట్టుదిట్టమైన బౌలింగ్తో ముంబైకి ఆదిలోనే షాక్ ఇచ్చారు. ఓపెనర్ పార్థీవ్(21), లెండిల్ సిమ్మన్స్ (14) ఓ మోస్తరుగా ఆడి పవెలియన్ చేరారు. ఇక ఫామ్లో వున్న రాయుడు (2) కూడా వెనుదిరగడంతో ముంబై 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ రోహిత్, పొలార్డ్ కలిసినా ఇన్నింగ్స్లో వేగం పెరగలేదు. 12వ ఓవర్లో నరైన్ అద్భుత బంతితో రోహిత్ను బౌల్డ్ చేశాడు. అయితే పాండ్యా రాకతో ముంబై ఇన్నింగ్స్కు అసలైన ఊపు వచ్చింది. పొలార్డ్ను మించి దూకుడును కనబరిచి.. జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు. 25 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఐదు ఓవర్లలో 72 పరుగులు రాగా ఇందులో 50 పరుగులు పాండ్యావే కావడం విశేషం.
ఇక 172 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన కోల్కతా ఆటగాళ్లు ఆరో ఓవర్ వరకు బాగానే రాణించారు. ఉతప్ప (25), గంభీర్ (38) ఫర్వాలేదనిపించారు. అయితే.. మనీష్ పాండే (1) రనౌట్ అయ్యాడు. అనంతరం వచ్చిన యూసుఫ్ పఠాన్ (52) పరుగులతో చెలరేగాడు. పఠాన్తో కలిసి షకీబ్ (23) వేగంగా ఆడాడు. చక్కటి ఫోర్లతో ప్రమాదకరంగా మారుతున్న దశలో షకీబ్, పాండ్యకు క్యాచ్ ఇచ్చాడు. ఇక రస్సెల్ (2) విఫలమయ్యాడు. ఇలా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో చివరి ఓవర్లో 12 పరుగులు కావాల్సిన దశలో పొలార్డ్ అద్భుతమే చేశాడు. పఠాన్ను తొలి బంతికే అవుట్ చేయడంతో పాటు చివరి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో ఐదు పరుగులతో ముంబై గెలిచింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more