రికార్డుల రారాజుగా తన పేరుపై లిఖించుకున్న ఇండియన్ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్రసింగ్ ధోనీ.. ఓ అరుదైన రికార్డును తన చేజేతులా మిస్ చేసుకున్నాడు. అది కూడా తన సొంతగడ్డపైనే ఘోరంగా పరాజయం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటివరకు తన జోరును కొనసాగించిన ధోనీ.. ప్రత్యర్థి ఆటగాళ్ల ప్రతిభ ముందు తలొగ్గక తప్పలేదు. దీంతో తన కెరీర్ లో సాధించాల్సిన మరో రికార్డును వదులుకోవాల్సి వచ్చింది.
ఐపీఎల్-8లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటినుంచి అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే! మైదానంలో పరుగుల వర్షాన్ని కురిపించే భారీ బ్యాట్స్ మెన్లు, ఆటగాళ్లను వెనువెంటనే పంపించగల సత్తా వున్న బౌలర్లు, ప్రపంచంలోనే కూలెస్ట్ కెప్టెన్ గా పేరొందిన ధోనీ.. వంటి దిగ్గజాలు ఈ జట్టులో వుండటంతో విజయాలు ఈ జట్టు వెంట పరుగులు తీస్తూ వస్తోంది. అంతేకాదు.. ఐపీఎల్ లో సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ జట్టుకే సాధ్యం! అప్పుడప్పుడు పరాజయాలు పాలయిన ఆ తర్వాతి ఇన్నింగ్స్ లో తన ప్రతాపంతో పరాజయాల ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. ఇలాంటి ఈ జట్టుకు ముంబై టీమ్ భారీ ఝలకిచ్చింది. అప్పటివరకు చెన్నై చేతిలో వున్న విజయాన్ని ముంబై ఒక్కసారిగా లాక్కుని అందరికీ షాక్ కు గురిచేసింది. శుక్రవారం జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ మీద ముంబై జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. వరుసగా ఐదో విజయం సాధించడంతోపాటు రెండేళ్ల తరువాత చెపాక్ స్టేడియంలో సొంతగడ్డపై చెన్నై జట్టును ముంబై ఓడించింది. దీంతో చెన్నై జట్టు డబుల్ హ్యాట్రిక్ చేసే రికార్డును వదులుకుంది.
వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో టాపార్డర్ ఆటగాళ్లు పవెలియన్ చేరడంతో ఆ జట్టుకు పరుగులు చేయడంలో ఇబ్బంది కలిగింది. ఓపెనర్లు బ్రెండన్ మెకల్లమ్ (23), డ్వేన్ స్మిత్ (27) శుభారంభం ఇచ్చారు. కానీ ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరుపై కన్నేసిన చెన్నె ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. పవన్ నేగి (36) మెరుపు ఇన్నింగ్స్ కి, ధోనీ (39) తన కెప్టెన్ ఇన్నింగ్స్ తో బాధ్యయుతంగా రాణించడంతో.. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ముంబై బౌలర్ల విషయానికొస్తే.. హర్భజన్, వినయ్, మెక్ క్లెనఘన్, సుచిత్ ఒక్కో వికెట్ తో రాణించారు.
ఇక 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు.. తొలుత 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత కాస్త తడబడింది. ఈ జట్టులో భారీ స్కోరుతో రాణిస్తాడన్న రోహిత్, పొలార్డ్ (1) ఇద్దరూ వెనుదిరగడంతో జట్టు ఇబ్బందుల్లో పడిపోయింది. ఓ దశలో 2 ఓవర్లలో 32 పరుగుల లక్ష్యం చేయాల్సిన సమయం వచ్చింది. దీంతో విజయం చెన్నైదేనని అంతా భావించగా.. రాయుడు (34(19b)) ఇన్నింగ్స్ కి, హార్థిక్ పాండ్య (21(8b)) అద్భుత బ్యాటింగ్ తోడవ్వడంతో.. మరో 4 బంతులు మిగిలివుండగానే ముంబై విజయం సాధించింది. ఈ ఐపీఎల్ లో ముంబైకి వరుసగా ఐదో విజయమిది!
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more