2011లో ఐసీసీ ప్రపంచ కప్ గెలిచిన ఆ ఉద్విగ్ధ భరిత క్షణాల్లో భారత క్రికెట్ దిగ్గజాలు కన్నీరు పెట్టారట. భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సహా భారత జట్టు సభ్యులు అందరు కంటతడి పెట్టారట. అయితే ఇవి నిజమైన కన్నీరు కాదు.. ఆనందంతో వచ్చిన కన్నీటీ బాష్పాలని స్వయంగా టీమిండియా కెప్టెన్ ధోనీ ఓ పుస్తకంలో తాజాగా చెప్పారు. 2011 ప్రపంచ కప్ కోసం భారత్ ఫైనల్ మ్యాచ్ను శ్రీలంకతో ఆడింది. ముంబై వాంఖేడే స్టేడియంలో ఏప్రిల్ 2, 2011న జరిగింది. ఈ విజయంపై ధోని ఓ పుస్తకంలో రాశాడు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత తాము ఏడుస్తామని ఎప్పుడూ అనుకోలేదని కూడా ఆ పుస్తకంలో రాశాడు.
డ్రెస్సింగ్ రూంలో ప్రతి ఒక్కరు ఏడ్చారు. అందరు అంటే ప్రతి ఒక్క జట్టు సభ్యుడు. మొత్తం 15 మంది ఆటగాళ్లు, స్టాఫ్, జట్టుతో సంబంధం కలిగిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టార'ని ధోనీ చెప్పాడు. ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో తాను ఏడుస్తానని ఎప్పుడు ఊహించలేదన్నాడు. 'గెలిచాక ఏడుస్తానని నేను ఎప్పుడు ఊహించలేదు. కానీ అది జరిగింది. ప్రపంచ కప్ గెలిచాక తమ ఎమోషన్స్ను ఈ ప్రపంచం చూడలేదు. ఎందుకంటే అందుకు సంబంధించిన ఫుటేజ్ లేద'ని పేర్కొన్నాడు. కాగా 2015 ప్రపంచ కప్కు ఫెంటాస్టిక్ గైడ్తో వెళ్తున్నామని కప్ ను నిలబెట్టుకునేందుకు టీమిండియా శయశక్తులా కృషి చేస్తుందని అన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more