ఆ మ్యాచ్ పైనే ఎన్నో ఆశలు.. గత కొన్నేళ్లుగా సాగుతున్న ప్రరోక్ష యుద్ద వాతావరణ నేపథ్యంలో దాయాది దేశాల మధ్య ప్రత్యక్ష యుద్దాన్ని తలపిస్తుంది ఆ మ్యాచ్. ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్ చరిత్రలో వున్న అన్ని రికార్డలను బద్దలుకోట్టి, రికార్డులను తిరగరాస్తు.. ముందుకు వెళ్తోంది. ఇంతకీ ఆ మ్యాచ్ ఎవరిదో తెలుసా.. భారత్, పాకిస్థాన్ లు తలపడుతున్న మ్యాచ్. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఈ మ్యాచ్ నూతన అధ్యాయాలను తన పేరున నమోదు చేసుకోబోతోంది. ఫిబ్రవరి 15న అస్ట్రేలియాలోని అడిలైట్ లో జరగనున్నా ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు విక్రయించిన టిక్కెట్లు..హాట్ కేకుల్లా కేవలం గంటలోపు అమ్మడయ్యాయి.
ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా దాయాదులు తలపడుతున్న తదుపరి మ్యాచ్ను వివిధ మాధ్యమాల ద్వారా వంద కోట్లకు పైగా అభిమానులు వీక్షించే అవకాశం ఉందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. 2011 ప్రపంచకప్ సెమీస్లో తలపడిన ఈ రెండు జట్ల మ్యాచ్ను 98 కోట్ల 80 లక్షల మంది తిలకించారు. ఈసారి ఆ రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఎగబడడంతో ఆరు నెలల కిందటే అమ్ముడయ్యాయి.
దీంతో ఇక ఇతర మాధ్యమాల ద్వారా మ్యాచ్ ను తిలకించేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. 2011లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా అప్పట్లో దేశంలో అప్రకటిత సెలవు నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియాలో ఇంతకుముందు ఏ క్రికెట్ మ్యాచ్కు కూడా ఇంత ఆసక్తి కనబడలేదని ప్రపంచకప్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఐదుసార్లు భారత్, పాక్ జట్లు తలపడగా ప్రతిసారీ భారత్దే పైచేయి అయ్యింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more