బీసీసీఐ, సెలక్షన్ బోర్డు మద్య ఉన్న విభేదాల కారణంగా క్రికెటర్లు ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో రెండు సిరీస్ లు ఉన్నప్పటికి ఇప్పటివరకు ఈ మ్యాచ్ లకు జట్లను మాత్రం ఖరారు చేయలేదు. ఇందుకు కారణం సెలక్షన్ కమిటీతో బోర్డుకు ఉన్న అభిప్రాయ బేధాలే అని తెలుస్తోంది. సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం రోజు ముంబైలో సమావేశం అయింది. ఈ భేటీలో త్వరలో ఆస్ర్టేలియాతో జరిగే టెస్ట్ మ్యాచ్ లతో పాటు, శ్రీలంకతో జరిగే ఐదు వన్డేల సిరీస్ లో చివరి రెండు వన్డేలకు జట్లను ఖరారు చేయాల్సి ఉంది.
కానీ జట్లను ప్రకటించకుండానే సమావేశం ముగించారు. స్పాట్ ఫిక్సింగ్ పై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై ఈనెల 10న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ీ నేపథ్యంలో కోర్టు తీర్పు తర్వాతే జట్టును ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ మ్యాచ్ కు గత ఫిక్సింగ్ తో సంబంధం లేకపోయినా., సెలక్షన్ కమిటీ మాత్రం ప్రస్తుతానికి జట్ల ఎంపికకు ఆసక్తి చూపలేదు.
సెలక్షన్ కమిటీ, బోర్డు వైఖరిపై క్రికెటర్ల నుంచి ఆశ్చర్యంతో పాటు అసహనం వ్యక్తం అవుతోంది. ఎవరెవరు ఎంపికయ్యారో ప్రకటిస్తే తాము ప్రాక్టీస్ ఇతర షెడ్యూల్ తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా సమయం అంతా దగ్గరపడ్డాక జట్టును ప్రకటిస్తే ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు. దేశంలో ఎంతో క్రేజ్ ఉన్న క్రికెట్ లాంటి ఆట విషయంలో ఇలా విభేదాలు పెట్టుకుని వ్యవహరిస్తే దేశానికి ఇబ్బందులు తప్పవని క్రీడా విశ్లేషకులు కూడ అంటున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more