ఏడో ఇండియన్ ప్రీమియర్ (ఐపిఎల్)లో వరుసగా రెండు మ్యాచ్లను చేజార్చుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ బోణీ చేసింది. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ను నాలుగు పరుగుల తేడాతో ఓడించింది. సన్రైజర్స్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించిన ఢిల్లీ నాలుగు వికెట్లకు 180 పరుగులు చేయగలిగింది.
కాగా, రెండు మ్యాచ్ల్లో వేధించిన బ్యాటింగ్ వైఫల్యాల నుంచి సన్రైజర్స్ బయటపడడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈ జట్టు 56 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 22 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్తో 33 పరుగులు చేసి షాబాజ్ నీషమ్ వౌలింగ్లో కెవిన్ పీటర్సన్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. అనంతరం ఆరోన్ ఫించ్తో కలిసిన డేవిడ్ వార్నర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
వీరిద్దరూ రెండో వికెట్కు అజేయంగా 128 పరుగులు జోడించారు. కేవలం ఒక వికెట్ నష్టపోయిన సన్రైజర్స్ 184 పరుగులు చేసింది. ఫించ్ 53 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 88, వార్నర్ 45 బంతుల్లో, మూడు ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ కూడా ఇన్నింగ్స్ను ధాటిగానే మొదలుపెట్టింది. క్వింటన్ డికాక్, మురళీ విజయ్ మొదటి వికెట్కు 99 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. 30 బంతుల్లో, ఆరు ఫోర్లు ఒక సిక్సర్తో 48 పరుగులు చేసిన డికాక్ను ఫించ్ క్యాచ్ పట్టగా కరన్ శర్మ అవుట్ చేయడంతో మొదటి వికెట్ను కోల్పోయింది.
చివరి ఓవర్లో విజయానికి 20 పరుగుల అవసరంకాగా, భువనేశ్వర్ కుమార్ వేసిన ఆ ఓవర్లో ఢిల్లీకి 15 పరుగులు లభించాయి. పరుగు ల వేటలో ఢిల్లీ కేవ లం ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయింది. నాలుగు ప రుగుల తేడాతో సన్రైజర్స్ విజయభేరి మోగించింది. టాప్ స్కోరర్ ఫించ్కి ప్లే యర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more