ఉపఖండంలో జరిగే ఆసియా కప్ టోర్నీ మొదటి మ్యాచ్ లో శ్రీలంక భోణీ కొట్టింది. నిన్న పాకిస్థాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో శ్రీలంక పోరాడి గెలిచింది. లసిత్ మలింగ మాయా జాలంతో పాకిస్థాన్ విజయం ముంగిట బోల్తా కొట్టింది. శ్రీలంక జట్టు సమిష్టిగా రాణించడంతో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఖాన్ ఉస్మాన్ అలీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీ స్కోరు చేసింది. శ్రీలంక ఆటగాళ్ళలో లాహిరు తిరుమన్నె (110 బంతుల్లో 102; 11 ఫోర్లు, 1 సిక్స్) శతకం సాధించగా...సంగక్కర (65 బంతుల్లో 67; 8 ఫోర్లు), మాథ్యూస్ (50 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఈ స్కోరు సాధ్యమైంది.
ఆ తరువాత 297 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ కి ఆదిలోనే కష్టాలు ఎదురయ్యినా, తరువాత పుంజుకొని చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. 120 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ ని మిస్బావుల్ హక్ (73) ఉమర్ అక్మల్ (74) మంచి భాగస్వామ్యాన్ని నెల కొల్పి విజయానికి చేరువగా 46 బంతుల్లో 55 పరుగుల వరకు మ్యాచ్ ని తీసుకొచ్చినా, పాక్ అంచనాల్ని తలకిందులు చేస్తూ 42 పరుగులకే చివరి ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూశారు. మలింగ చివరి వికెట్లు (5-52) తో పాకి నడ్డి విరిచాడు. మలింగకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Knr
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more