గత నాలుగు సంవత్సరాల నుండి సినీ ప్రేక్షకులనే కాకుండా, క్రికెట్ అభిమానులను అలరిస్తున్న సీసీఎల్ -4 (సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ) నిన్నటితో ముగిసింది. నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ కర్ణాటక బుల్ డోజర్స్ టైటిల్ ను నిలబెట్టుకుంది. కేరళ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో కర్ణాటక జట్టు 36 పరుగుల తేడాతో గెలిచి ఈ సీజన్ విజేతగా నిలవడంతో వరుసగా రెండోసారి టైటిల్ ని గెలుచుకుంది.
ఈటోర్నీలో అన్ని భాషలకు చెందిన జట్లు పాల్గొనగా చివరికి కర్ణాటక, కేరళ జట్లు ఫైనల్ కి చేరుకున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక తన అద్బుతమైన ఆట తీరుతో భారీ స్కోరును చేసింది. కర్ణాటక ఆటగాళ్లు రాజీవ్ అద్భుత సెంచరీ (42 బంతుల్లో 112 నాటౌట్, 12 ఫోర్లు, 7 సిక్సర్లు), ధృవ్ శర్మ అర్ధ సెంచరీ (41 బంతుల్లో 56, 6 ఫోర్లు)లతో రాణించడంతో 211 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఆ తర్వాత బరిలోకి దిగిన కేరళ స్ట్రయికర్స్ 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. నందకుమార్ అర్ధ సెంచరీ (47 బంతుల్లో 78, 8 ఫోర్లు, 4 సిక్సర్లు)తో రాణించాడు. రాజీవ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టైటిల్ ఫేవరెట్ బరిలో ఉన్న తెలుగు వారియర్స్ సెమీ ఫైనల్ కంటే ముందే టోర్నీ నుండి నిష్ర్కమించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more