భారత క్రికెట్ లెజెండ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ లబ్దికోసం మరిన్ని టెస్టులు ఆడింటే బాగుండేదని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అన్నాడు. ''అభిమానులు ఇష్టపడే సచిన్ లాంటి వ్యక్తి మరిన్ని టెస్టు మ్యాచ్లు ఆడింటే బాగుండేది. క్రికెట్ ఆడే సమయంలో అతను ఏవిధంగా టెస్టు క్రికెట్ను ప్రోత్సహించాడో రిటైర్మెంట్ తర్వాత కూడా సచిన్ అదే విధంగా ప్రోత్సహిస్తాడని భావిస్తున్నాను''అని ఎఫ్ఐసీసీఐ సెమీనార్ సంద ర్భంగా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రణతుంగ అన్నాడు. రిటైర్మెంట్పై క్రికెటర్ల నిర్ణయంపై రణతుంగ మాట్లాడుతూ.. రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునేందుకు తనకు కేవలం మూడు రోజులు పట్టిందని చెప్పాడు.
ఆ నిర్ణయం తీసుకునే సమయంలో పార్ట్ టైమ్ పొలిటిషియన్ అని, ఇన్ష్యూరెన్స్ ఏజెంట్నని, బిజినెస్ మ్యాన్ అని చెప్పాడు. అయితే క్రికెటే సర్వస్వంగా భావించే సచిన్ విషయంలో అటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమని తెలిపాడు. అయితే షార్ట్ ఫార్మాట్ల ముందు టెస్టు క్రికెట్ కనుమరుగు కాకుండా సచిన్ తగిన విధంగా సహాయం చేయాలని కోరాడు. సచిన్ ఇంతగా ఎదిగినా అతను ఒక విషయంలో మార లేదని చెప్పాడు. ఒకవేళ సచిన్ 1,00,000 పరుగులు చేసినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం పోలేదని.. ఇప్పటికీ క్రికెట్ గురించే ఆలోచిస్తాడని అన్నాడు. సచిన్ మెగా స్టార్ కంటే గొప్పవాడని.. ప్రపంచ యువ క్రికెటర్లు ఆదర్శ ప్రాయుడని రణతుంగ కొనియాడాడు. ప్రపంచంలో క్రికెట్ గురించి తనెక్కడ మాట్లాడినా.. సచిన్ ప్రస్తావన వస్తుందని చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more