డిపెండింగ్ ఛాంపియన్ కొల్ కత్తా నైట్ రైడర్స్ చాలా రోజుల తరువాత తన పూర్తి స్థాయి ప్రదర్శన చేసింది. ఈ సీజన్ లో అరకొర విజయాలనే సొంతం చేసుకున్న కోల్ కత్తా తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. నిన్న రాత్రి తన సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో చక్కని ప్రదర్శన కనబర్చిన కోల్కతా రాయల్స్ను చిత్తుగా ఓడించింది. ఇక కోల్ కత్తా ఫ్రాంఛైజీ అత్యధిక రేటు పెట్టి కొన్న రెండో ఆటగాడు... యూసుఫ్ పఠాన్ చానాళ్ళ తరువాత తనదైన శైలిలో ఆటను ప్రదర్శించాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ రహనే (6)తో పాటు ఫౌల్క్నర్ (1) వికెట్ను కూడా ఏడు పరుగుల తేడాతో కోల్పోయిన రాయల్స్ను మరో ఓపెనర్ షేన్ వాట్సన్ (35; 35 బంతుల్లో 4 ఫోర్లు)తో జత కలిసిన సామ్సన్ 36 బంతుల్లో 40 పరుగులు చేసి ఆదుకున్నాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 44 పరుగులు జతచేయడంతో మళ్లీ గాడిన పడ్డ రాయల్స్ గౌరవప్రదమైన స్కోరువైపు పయనించింది. కానీ చివర్లో మళ్లీ తడబాటుగు గురైనా నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగుల గౌరవ ప్రథమైన స్కోరు చేసింది.
ఈ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన కోల్ కత్తా ఓపెనర్లు గంభీర్, బిస్లా తొలి వికెట్ కి 41 పరుగులు జోడించి మంచి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరి తరువాత క్రీజ్ లోకి వచ్చిన కల్లీస్ (33; 30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), ఇర్ఫాన్ పఠాన్ (49; 35 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) మూడో వికెట్కు అజేయంగా 78 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. దీంతో 133 పరుగుల విజయ లక్ష్యాన్ని 17.2 ఓవర్లలోనే విజయాన్ని నమోదు చేసుకుంది. మరి ఇకనైనా కోల్ కత్తా ఇదే ఫాంను కొనసాగిస్తుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more