ఐపీఎల్ సీజన్ - 6 ప్రారంభం కాకముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై ఎవరికి అంచనాలు లేవు. ఎందుకంటే గత సీజన్లలో ఈ జట్టు వైఫల్యం చెందటమే. కానీ ఈ సీజన్ ప్రారంభం నుండి సన్ రైజర్స్ జట్టు చెలరేగి ఆడి అద్బుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పటి వరకు సొంత గడ్డ పై ఆడిన మూడు మ్యాచ్ ల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నిన్న రాత్రి పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్క్రిస్ట్ (25 బంతుల్లో 26; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం హైదరాబాద్ 18.5 ఓవర్లలో 5 వికెట్లకు 127 పరుగులు చేసింది. హనుమ విహారి (39 బంతుల్లో 46; 5 ఫోర్లు) రాణించగా, చివర్లో పెరీరా (11 బంతుల్లో 23 నాటౌట్; 3 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ జట్టు తొలి నాలుగు ఓవర్లలో 17 పరుగులే చేయగలిగింది. ప్రతి పరుగు కోసం తీవ్రంగా శ్రమించింది. సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి భారీ స్కోరు చేయలేకపోయింది.
స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ కూడా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. డి కాక్ (0) మరో సారి విఫలమయ్యాడు. అయితే విహారి మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడి జట్టును నిలబెట్టాడు. పార్థివ్ స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షత్ రెడ్డి (17 బంతుల్లో 19; 2 ఫోర్లు) అతనికి సహకారం అందించాడు. ఈ ఇద్దరు హైదరాబాదీలు కలిసి సునాయాసంగా పరుగులు రాబట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more