Michael vaughn lauds ms dhoni on double century

ms dhoni, ms dhoni double century, mahendra dhoni, indian captain m.s. dhoni, australia in chennai, chennai, shane warne, michael vaughn, mahendra singh dhoni, india vs australia, 1st test

michael vaughn lauds ms dhoni on double-century

ms-dhoni.gif

Posted: 02/25/2013 01:21 PM IST
Michael vaughn lauds ms dhoni on double century

michael vaughn lauds ms dhoni on double-century

కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అజేయ డబుల్ సెంచరీతో కదం తొక్కితే, విరాట్ కోహ్లీ శతకంతో అతనికి జత కలిశాడు. వీరి విజృంభణతో ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం కకావికలైంది. మొదటి టెస్టు మూడోరోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లకు 515 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసీస్‌పై 135 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించి, పట్టు బిగించింది. మూడు వికెట్లకు 182 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఉదయం ఆటను కొనసాగించిన టీమిండియా 196 పరుగుల స్కోరువద్ద సచిన్ తెండూల్కర్ వికెట్‌ను కోల్పోయింది. అతను 159 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లతో 81 పరుగులు చేసి, నాథన్ లియాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత ధోనీ, కోహ్లీ ఎదురుదాడి ప్రారంభమైంది. ఆసీస్ బౌలింగ్‌ను ఓ ఆట ఆడుకున్న ఇద్దరూ స్కోరు బోర్డును వేగంగా ముందుకు దూకించారు. ధోనీ ఆరో టెస్టు సెంచరీ పూర్తిచేయగా, కోహ్లీ నాలుగో టెస్టు సెంచరీని సాధించాడు. ఐదో వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత లియాన్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ చక్కటి క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. అతను 206 బంతులు ఎదుర్కొని, 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 107 పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా (16), రవిచంద్రన్ అశ్విన్ (3), హర్భజన్ సింగ్ (11) వికెట్లు త్వరత్వరగా కూలినప్పటికీ, భువనేశ్వర్ కుమార్ (నాటౌట్ 16)తో కలిసి ధోనీ కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 243 బంతులు ఎదుర్కొన్న అతను 22 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 206 పరుగులు సాధించి క్రీజ్‌లో నిలవడంతో, భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధ్యమైంది.

michael vaughn lauds ms dhoni on double-century

ఇంగ్లాండ్‌తో నాగపూర్‌లో జరిగిన చివరి టెస్టులో 99 పరుగుల స్కోరువద్ద దురదృష్టవశాత్తు రనౌటైన ధోనీ, ఈసారి అలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఒకవైపు ఆసీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తూనే మరోవైపు వికెట్లను కాపాడుకోవడంలో సఫలమయ్యాడు. కెరీర్‌లో మొదటి డబుల్ సెంచరీ చేసిన 31 ఏళ్ల ధోనీ, భారత్ తరఫున ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన వికెట్‌కీపర్‌గానూ రికార్డు సృష్టించాడు. 1964లో ఇంగ్లాండ్‌పై మద్రాస్ కార్పొరేషన్ స్టేడియంలో బుధి కుందరన్ 192 పరుగులతో నెలకొల్పిన రికార్డును ధోనీ అధిగమించాడు. మొదటి సెంచరీ పూర్తి చేయడానికి 119 బంతులు తీసుకున్న ధోనీ, మరో వంద పరుగులను 112 బంతుల్లోనే చేయడం అతని వీరవిహారానికి అద్దం పడుతుంది. కాగా, ఇంకా మరో రెండు రోజు ఆట మిగిలివున్న నేపథ్యంలో, సోమవారం ఉదయం టీమిండియా సాధ్యమైనంత ఎక్కువ స్కోరు చేయడం ద్వారా ఆసీస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేయనుంది. ఆతర్వాత ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం చేస్తే, టెస్టు మ్యాచ్‌ని భారత్ సొంతం చేసుకోవచ్చు. పలుమార్లు సింగిల్స్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, భువనేశ్వర్ కుమార్ ప్రయత్నాలను కాదంటూ, తానే ఎక్కువ బంతులను ఎదుర్కొన్న ధోనీ వ్యూహం ఏమిటో స్పష్టంగా అర్థమవుతున్నది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Australia take chennai test into fifth day lead by 40 runs
Vvs laxman slams ms dhoni for under bowling harbhajan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more