భారత్ - ఇంగ్లాండ్ వన్డే సిరీస్ లో భాగంగా నేడు ధోని ఇలాకాలో రాంఛి స్టేడియంలో విజయధుందుభి మోగించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 42.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. భారత్ ముందు 156 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమయింది.
156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 28 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అజింక్య రహానే పరుగులేమి చేయకుండానే వెనుదిగినా, గంభీర్, కోహ్లీ, యువరాజ్ రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. కోహ్లీ 77 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. యువరాజ్ 30 పరుగులు, గంభీర్ 34 పరులుగు చేశారు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో రూట్(39), బెల్ 25, బ్రెస్నన్ 25, కుక్ 17, పీటర్సన్ 17, మోర్గాన్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 3, అశ్విన్ 2, ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, షమీ అహ్మద్, రైనా తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ విజయంతో భారత్ 2 – 1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more