ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)కు కొత్త స్పాన్సర్ను ఎంపిక చేసే పనిలో పడింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ). ఐదు సంవత్సరాలు ఈ టోర్నమెంట్కు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించిన డిఎల్ఎఫ్ కాంట్రాక్టు కాలం పూర్తయింది. దీనితో కొత్త స్పాన్సర్ అవసరం ఏర్పడింది. దీనితో కొత్త స్పాన్సర్ కావాలంటూ టెండర్లను ఆహ్వానించింది. ఎక్కువ మొత్తాన్ని బిడ్ చేసి, స్పాన్సర్షిప్ను సంపాదించుకునే సంస్థలతో తమ ఒప్పందం 2013 నుంచి 2017 వరకూ, ఐదేళ్లు కొనసాగుతుందని వివరించింది. బిడ్ను సంపాదించిన తర్వాత హక్కులను ఇతరులకు అమ్మడం చెల్లదని స్పష్టం చేసింది. అలాంటి సంస్థలకు బిడ్లో పాల్గొనే హక్కు ఉండదని పేర్కొంది. నవంబర్ 21వ తేదీలోగా దరఖాస్తులు పొందవచ్చని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more