విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలతో వరుసగా ఈ వారంలో రెండో రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. అగ్రరాజ్యం అమెరికా కేంద్రీయ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు త్వరలో వడ్డీ రేట్లను సమీక్షించనుందన్న వార్తల నేపత్యంలో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో దేశీయ సూచీలు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మరోమారు 8250 మార్కుకు దిగవన ట్రేడింగ్ ముగించింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా నిన్న నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లను ఇవాళ ఫెడరల్ రిజర్వు ద్రవ్యపరిమితి విధాన సమీక్ష సమావేశం వార్తలు దెబ్బతిశాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభంతోనే మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టాన్ని మూటగట్టుకుని 27 వేల 253 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 28 పాయింట్లు నష్టంతో 8,232 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.
ఈ తరుణంలో ఇవాల మొత్తంగా 1264 షేర్లు లాభాలను ఆర్జించగా, 1446 షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా 142 సంస్థల షేర్లు తటస్థంగా వున్నాయి. ఈ క్రమంలో బిఎస్సీ బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిష్టీ క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, ఐటీ, మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ సూచీలు నష్టాలలో చవిచూడగా, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ భారీగా నష్టాలను ఎదుర్కోన్నాయి. ఎఫ్ఎంజీసీ,, మద్య తరహా, చిన్న తరహా పరిశ్రమల సంస్థల సూచీలు లాభాలను అర్జించాయి. ఈ నేపథ్యంలో మారుతి సుజుకీ, అల్ట్రా టెక్ సిమెంట్, సన్ ఫార్మా, బిపిసిఎల్, ఏషియన్ పెయింట్స్ తదితర సంస్థలు లాభాలను ఆర్జించగా, లుపిన్, ఓఎన్ జీసీ, గెయిల్, హెచ్ డీ ఎఫ్ సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more