విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలతో ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారాయి. ఒక దశలో దేశవాళీ ఇన్వెస్టర్లు సైతం ఈక్విటీలను విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నట్టు కనిపించినా, ఆసియా మార్కెట్ల సరళి కొనుగోలు సెంటిమెంటు నిలపడంతో, ఈక్విటీల విక్రయాలు ఆగిపోయాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభంతోనే 100 పాయింట్ల మేర లాభాలను ఆర్జించిన మార్కెట్లు.. తరువాత తీవ్ర ఒడిదోడుకులకు గురై చివరకు నష్టాలతో ముగిశాయి దీంతో మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టాన్ని మూటగట్టుకుని 27 వేల 362 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 35 పాయింట్లు నష్టంతో 8,260 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.
ఇవాళ మొత్తం 2,869 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 978 కంపెనీలు లాభాలను, 1,735 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో బిఎస్సీ బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిష్టీ సహా కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్, మెటల్స్, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ, మద్య తరహా, చిన్న తరహా పరిశ్రమల సూచీలు నష్టాలలో పయినియంచగా, మిగిలిన అటో, క్యాపిటల్ గూడ్స్, ఐటీ సంస్థల సూచీలు లాభాలను అర్జించాయి. ఈ నేపథ్యంలో బిహెచ్ఈఎల్, వేదంతా, బజాజ్ అటో, టాటా స్టీల్, హెచ్ సీ ఎల్ టెక్ తదితర సంస్థలు లాభాలను ఆర్జించగా, ఏషియన్ పెయింట్స్, యస్ బ్యాంక్, కోల్ ఇండియా, అల్ట్రా టెక్ సిమెంట్, భారతీ ఎయిర్ టెల్ తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more