వారాంతంలో మార్కెట్లు లాభాలతో ముగిసాయి. వరుసగా మూడు రోజుల పాటు మూటగట్టుకున్న నష్టాలను నిన్నటి లాభాలతో స్వస్తి పలికిన మార్కెట్లు ఇవాళ వరుసగా రెండో రోజు భారీ లాభాలను ఆర్జించాయి. దీంతో ఎనిమిది వారాల గరిష్టస్థాయిలో మార్కెట్లు పయనించాయి. విదేశీ మారెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు నిత్యావసరాల సరుకుల ధరాఘాత సూచికలో ధరాఘాతం తగ్గుముఖం పట్టడంతో పాటు, రెపో రేటు 50 డిసెమిల్స్ మేర అర్బీఐ తగ్గించిన నేపథ్యంలో మదుపరులు సెంటిమెంట్ బలంగా కోనసాగడంతో మార్కెట్లు లాభాలలో పయనించాయి.
గత కొన్ని రోజులుగా 27 మార్కు వద్ద ఊగిసలాడుతున్న సెన్సెక్.. క్రితం రోజు లాభాలతో ఆ మార్కును దాటగా, ఇవాళ ఉదయం నుంచి వచ్చిన లాభాలను అధిమిపట్టుకుని ఏకంగా 27 వేల 215 పాయింట్ల వద్దకు చేరింది. అటు నిఫ్టీ కూడా 8200 మార్కుకు మరోమారు దాటింది. ఉదయం ప్రారంభంతోనే మార్కెట్లను లాభాలు పలుకరించాయి. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 204 పాయింట్లు లాభాన్ని ఆర్జించి 27 వేల 215 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించగా, అటు నిఫ్టీ కూడా 59 పాయింట్లు లాభంతో 8,238 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.
ఈ క్రమంలో కన్జూమర్ డ్యూరబుల్ గూడ్స్, మెటల్స్ సూచీలు మినహా అన్ని సూచీలు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా ఆటో, బ్యాకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. ఎఫ్ ఎం జీ సీ, హెల్త్ కేర్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, టెక్నాలజీ, చిన్న పరిశ్రమలు,మద్య తరహా పరిశ్రమల సూచీలు కూడా స్వల్ప లాభాలను గడించాయి. కాగా మిగిలిన అన్ని సూచీలు స్వల్ప లాభాలను అర్జించాయి. ఈ నేపథ్యంలో లార్సెన్, ఎస్ బి హెచ్, బిపీసీఎల్, యస్ బ్యాంక్, మారుతి సుజుకీ తదితర సంస్థలు లాభాలను ఆర్జించగా, లుపిన్ అదాన పోర్ట్స్, ఐడియా సెల్యూలార్, బ్యాంక్ ఆప్ బరోడా, టాటా స్టీల్ తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more