విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో స్టాక్ మార్కెట్లు లాభాలలో పయనిస్తున్నాయి. మదుపరులు కొనుగోళ్లకు ఆస్తక్తి కనబడర్చడంతో రెండో రోజు వరుసగా దేశీయ సూచీలు పరుగులు పెడుతున్నాయి. ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే నష్టాలను చవిచూసిన సెన్సెక్.. ఆ తరువాత క్రమంగా కోలుకుంది. మార్కెట్ ప్రారంభంలో 137పాయింట్ల నష్టంతో సెన్సెక్స్.. 26 వేల 512 పాయింట్ల వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి క్రమంగా కోలుకున్న మార్కెట్.. మరో గంటలో 250 పాయింట్ల లాభంతో 26 వేల 879 పాయింట్ల వద్దకు చేరుకుంది.
వారారంభంలో రెండు రోజుల వరుస నష్టాలతో ఎనమిది వేల పాయింట్లకు దిగువన ట్రేడింగ్ సాగించిన నిఫ్టీ కూడా 62 పాయింట్ల లాభంతో ఎనమిది వేలకు మార్కుకు పైన ట్రేడింగ్ సాగిస్తోంది. ప్రస్తుతం నిఫ్టీ కూడా 8 వేల 37 పాయింట్ల వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. హీరో మోటార్ కార్పోరేషన్, సన్ ఫార్మసీ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, సిప్లా, ఎల్ అండ్ టి సంస్థల షేర్లు అత్యున్నత లాభాలను ఆర్జించగా, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనీలీవర్, మహేంద్ర అండ్ మహేంద్రా సంస్థల షేర్లు నష్టాలను నమోదు చేసుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more