బ్రెజిల్కి చెందిన శాప్ (సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామింగ్) కన్సల్టింగ్ సంస్థ కాంప్లెక్స్ ఐటీలో దేశీ దిగ్గజం టెక్ మహీంద్రా అనుబంధ సంస్థ మహీంద్రా సత్యం 51% వాటాలు కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం మొత్తం విలువ దాదాపు రూ. 124 కోట్లు (23 మిలియన్ డాలర్లు) మేర ఉండగలదని కంపెనీ పేర్కొంది. ముందస్తుగా సుమారు రూ. 35 కోట్లు (6.5 మిలియన్ డాలర్లు) నగదు రూపంలో చెల్లిస్తున్నట్లు వివరిం చింది. ఈ నెలాఖరు నాటికి డీల్ పూర్తి కావొచ్చని మహీంద్రా సత్యం పేర్కొంది. వచ్చే 18 నెలల్లో కాంప్లెక్స్ ఆదాయాలను బట్టి చెల్లించాల్సిన మొత్తం దాదాపు 23 మిలియన్ డాలర్ల దాకా ఉంటుందని టెక్ మహీంద్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ భట్ చెప్పారు. కంపెనీ స్థూల లాభానికి ఆరు రెట్లు చెల్లించేలా డీల్ స్వరూపం ఉంటుందని తెలిపారు. మహీంద్రా సత్యం, కాంప్లెక్స్ కలిసి.. భారీ స్థాయి తయారీ, ఆర్థిక, కన్సూమర్ సర్వీసెస్ కంపెనీలకు కావాల్సిన సొల్యూషన్స్ అందిస్తాయని భట్ వివరించారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more