కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల దారుణమారణకాండను నిరసిస్తూ.. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ జాతీయ ప్రదాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిన్న తెల్లవారు జామును నాలుగు గంటలకు అమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ మధ్యాహ్నం వరకు అక్కడే నిర్భంధించారు. అయితే ప్రతిపక్ష పార్టీకి చెందిన అగ్రనాయకురాలని అదుపులోకి తీసుకున్న పోలీసులు చట్టం ప్రకారం 24 గంటల వ్యవధిలో అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చాలి.
కానీ అమెపై ఎలాంటి అభియోగాలు మోపని పోలీసులు.. ఎందుకు అదుపులోకి తీసుకున్నారో.. ఏ సెక్షన్ల కింద అమెపై అభియోగాలను మోపారో కూడా అర్థంకావడం లేదని కాంగ్రెస్ నేతల వాదన. అంతేకాదు ఇవాళ ఉదయం అమె కూడా ఇదే విషయాన్ని పొందుపరుస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒ ట్వీట్ పోస్టు చేశారు. ఏ నేరం చేయని తాను.. చట్టం ప్రకారం సీతాపూర్ లోని పీఏసీ గెస్ట్ హౌజ్ లో నిర్భంధంలో వున్నానని, ఎలాంటి ఆర్డర్ లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా తనను ఇక్కడ పోలీసులు నిర్భంధంలో ఉంచారని అమె పేర్కోన్నారు.
అయితే.. మీ ప్రభుత్వంలోని అందులోనూ మీ క్యాబినెట్ లో మంత్రిగా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కొడుకు అశీష్ మిశ్ర తన కారుతో రైతులను తొక్కేసుకుంటూ వెళ్లి.. దారుణ మారణకాండకు కారణమయ్యారు. మరి ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదు.? ఆ మంత్రిని ఎందుకు మీరు బర్తరప్ చేయలేదు అని అమె ప్రశ్నించారు. ఆదివారం రోజున ఘటన జరిగినా.? అరెస్టు చేయడానికి ఇంకా పోలీసులకు అనుమతులు ఎందుకు ఇవ్వలేదని అమె ప్రశ్నించారు. పోలీసులను వారి పనిని వారు చేసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారని నిలదీశారు. నేరాలు చేసిన వారు స్వేచ్ఛవాయువును పిలుస్తారా.? మృతులను పరామర్శించడానికి వచ్చిన తమను అరెస్టు చేస్తారా.? అని అమె ప్రశ్నించారు.
TW: Extremely disturbing visuals from #LakhimpurKheri
— Congress (@INCIndia) October 4, 2021
The silence from the Modi govt makes them complicit. pic.twitter.com/IpbKUDm8hJ
ఈ సందర్భంగా కేంద్రమంత్రి తనయుడు అశీష్ మిశ్రాపై అరోపణలు చేస్తూ తన ఎస్యూవీ కారును నడిపిస్తూ రైతులను ఎలా తొక్కేస్తూ వెళ్తున్నారో ఈ వీడియోలో వుంది. దీనిని మీరు చూశారా.? మరి చూసినా చర్యలు ఎందుకు తీసుకోలేదని అమె ప్రశ్నించారు. ఈ విషయాన్ని పక్కనబెడితే ప్రియాంక గాంధీని అరెస్టు చేశామని అతిధి గృహానికి తరలించిన పోలీసులు అమెను న్యాయస్థానంలో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. దేశంలో నియంత తరహా పాలన సాగుతోందా.? చట్టం ముందు అందరూ సమానమే అని అంటారు.. మరి ప్రియాంక విషయంలో బీజేపి ప్రభుత్వాలు ఎందుకిలా కొత్త తరహాలో వ్యవహరిస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more