హైదరాబాద్ నగరశివారుల్లోని అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం వెనుక రియల్ హస్తాలు వున్నట్లు అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ కు చెందిన పెద్దలు వెనుకగా వ్యవహరిస్తూ.. అమెపై దారుణ చర్యలకు పాల్పడేలా చేశారా.? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మండల ప్రజలకు న్యాయం అందించే స్థానంలో వున్న అమెపై అన్యాయంతో గెలిచేందుకు రియల్ మూకలు పన్నిన కుట్రలలో అమె బలైపోయిందా.? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. తమ దారిలోకి రాని అమెను అడ్డుతొలగించుకునేందుకు మతిస్థిమితం లేని వ్యక్తిని పావుగా వాడుకున్నారా.? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.
ముక్కుసూటిగా తన విధులను నిర్వహిస్తున్న అధికారిని.. డబ్బు, పరపతి సహా ఎలాంటివాటికి లొంగకపోవడంతో అమె ప్రాణాలను సైతం హరిస్తామని.. బెదిరింపులకు కూడా అమె జంకకపోవడంతో అమెను అత్యంత భయానకంగా సజీవ దహనం చేయించారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒక సాధారణ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించి.. తన అకుంఠిత దీక్షతో గ్రూప్ పరీక్షలు రాసిన అమె.. పరీక్షలలో ఉత్తీర్ణురాలై ఎమ్మార్వోగా పదవీ బాధ్యతలను చేపట్టారు. అలా పదవీ బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే అమె రంగారెడ్డి జిల్లా కలక్టర్ చేతుల మీదుగా జిల్లాలో ఉత్తమ ఎమ్మార్వోగా కూడా అవార్డులను అందుకున్నారు.
ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సురేష్ ముదిరాజ్ అనే మతిస్థిమితం లేని రైత్తు తానే ఈ దారుణానికి పాల్పడ్డానని అంగీకరించడం.. తాను చనిపోదామని బావించానని చెప్పడం వెనుకునున్న అసలు రహస్యాలు ఏమై వుంటాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే తన పొలం పాస్ బుక్ విషయమై గత కొన్ని నెలలుగా తాను ఎమ్మార్వో విజయారెడ్డి చుట్టూ తిరుగుతున్నానని, కానీ అమె తనకు పాస్ బుక్ మంజూరు చేయలేదని సురేష్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. అయితే ఈ పోలం న్యాయపరమైన చిక్కుల్లో వుండటం.. అందునా జిల్లా జాయింట్ కలక్టర్ నుంచి కూడా సదరు పోలం పాస్ బుక్ లు మంజూరు చేయకూడదని స్పష్టమైన అదేశాలు వున్నాయి.
ఈ విషయం ఎమ్మార్వో చెప్పిన తరువాత కూడా సురేష్.. అమెపై పెట్రోల్ పోసి నిప్పంటించడం ఎందుకు చేశాడు. నిందితుడ్ని ఎవరు ప్రేరేపించారు.? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి వుంది. ఇక నిందితుడు దారుణ ఘటనకు ఒడిగట్టే ముందు ఎమ్మార్వో కార్యాలయంలో తన పెదనాన్న దుర్గయ్యతో అనేక పర్యాయలు ఫోన్ ద్వారా సంబాషించాడని పోలీసులు గుర్తించారు. అయితే తెరపైకి సురేశ్ ను నిలిపిన దుర్గయ్య.. తన వెనుకునున్నది ఎవరన్న విషయాలను కూడా తెలపాల్సి వుంది. అయితే దుర్గయ్య వెనుక రియల్ ఎస్టేట్ రంగానాకి చెందిన బడాబాబులు వున్నారని అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఎందుకంటే భూబాకాసురల చేతుల్లో బలైపోయిన తహశీల్దార్ విజయారెడ్డి తనకు ప్రమాదం పొంచివుందన్న విషయాన్ని ముందుగానే ఊహించారని ఆమె బంధువుల తెలిపారు. విజయారెడ్డి హత్యపై స్పందించిన ఆమె మేనమామ వెంకట్ రెడ్డి... కొద్దిరోజుల క్రితమే కలక్టర్ కార్యాలయంలో తనకు సెక్యూరిటీ విషయమై అమె పిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక్కడే అనుమానాలకు తావిస్తోంది. సురేశ్ లాంటి మతిస్థిమితం తప్పిన రైతులు బెదిరించినంత మాత్రాన ఎమ్మార్వో స్థాయి అధికారి తన భద్రత కోసం జిల్లా కలక్టర్ వద్దకు పిర్యాదు చేయరన్న వాదనలు వినబుడుతున్నాయి. అయితే సురేశ్, దుర్గయ్యల వెనుకునున్న రియల్ గద్దలు ఈ దారుణానికి పాల్పడి వుంటాయన్న అనుమానాలు వినబడుతున్నాయి.
భూ వివాదాన్ని పరిష్కరించకపోవడంతో తహసీల్దార్ ఎదుటే ఆత్మహత్య చేసుకోవాలని సురేశ్ను పంపించి ఉంటారని.. అయితే, తీవ్ర వాగ్వివాదం జరగడంతో క్షణికావేశంలో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. నిజానికి అంతకు ముందెప్పుడూ సురేశ్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వివాదంలో ఉన్న భూమికి సంబంధించి సురేశ్కు అసలు అవగాహనే లేదంటున్నారు. మతిస్థిమితం లేని సురేశ్ ఎవరైనా రెచ్చగొట్టగానే రెచ్చిపోతాడని, అతడి బలహీనతను ఎవరో ఇలా వాడుకుని ఉంటారని గ్రామస్థులు చెబుతున్నారు. ఇదంతా ఎవరో కావాలనే చేయించారని నిందితుడు సురేశ్ తల్లి కూర పద్మ పేర్కొంది. ఇంతటి ఘాతుకానికి పాల్పడే ధైర్యం అతడికి లేదని ఆమె తెలిపింది. అసలేం జరిగిందీ.? వెనుకున్నదెవరన్న అంశాలను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more