ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మరో నెల రోజుల్లోనే చట్టసభలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే చట్ట సభలోకి(ఎమ్మెల్యేగా) అడుగుపెడతానని బ్యాక్ డోర్ లు తనకు ఇష్టం ఉండవని(ఎమ్మెల్సీగా) ఇది వరకే లోకేష్ బహిరంగంగా ప్రకటించాడు. అయినప్పటికీ జాప్యం చేయకుండా ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానం ద్వారానే తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భర్తీకి ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేయడంతో అధిష్ఠానం ఆ దిశగా పావులు కదుపుతోంది.
లోకేశ్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబునాయుడు ఇప్పటికే నిర్ణయించారు. అయితే మంత్రి కావాలంటే రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో ఏదో ఒక దానిలో సభ్యుడై ఉండాలి. ప్రస్తుతం శాసనసభలో ఖాళీ లేకపోవడంతో ఎమ్మెల్సీగా చేసి అటునుంచి మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే ఇందుకోసం తెలుగుదేశం అధినేత ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్... రెండు మార్గాలు ఉన్నాయి. ఫ్రంట్ డోర్ విషయానికొస్తే... లోకల్ బాడీల కోటా లేదా గ్రాడ్యుయేట్స్ కోటా ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనటం. లోకేష్ కు చరిష్మా ఉందని ప్రజల్లోకి సంకేతాలు పంపేలా ఈ రాజమార్గం పనికొస్తుందని బాబు భావిస్తున్నాడు.
మరోకటి బ్యాక్ డోర్.. గవర్నర్ కోటాలో నామినేట్ చేయటం, లేదా ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేయటం. ఇది ఏ రిస్క్ లేని చాలా సులువైన పద్ధతి. దీనికే లోకేష్ మక్కువ చూపుతున్నప్పటికీ చంద్రబాబు మాత్రం ఓటింగ్ ఎన్నికలకే వెళ్లమని సూచించాడంట. స్థానిక సంస్థల మీద ఆధారపడటం అవమానంగా భావిస్తున్న చినబాబు ఎమ్మెల్యే కోటా ద్వారానే మండలిలో అడుగుపెట్టాలని భావిస్తున్నప్పటికీ తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ కోటాలో ప్రత్యక్ష ఎన్నికల బరిలో దింపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన ప్రతిభాభారతి, సి.రామచంద్రయ్య, చెంగల్రాయుడు, సుధాకర్బాబు, సతీశ్రెడ్డి, పీజే చంద్రశేఖర్, మహ్మద్ జానీలు వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నారు. వారి స్థానాల్లో కొత్తగా ఏడుగురిని ఎన్నుకోవాల్సి ఉంది. మార్చి 20 నాటికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తికావాల్సి ఉండడంతో నెల రోజుల్లోనే లోకేశ్ చట్టసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more