అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా అరకోర సభలు మినహా తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రజలతో మమేకం అయిన దాఖలాలు పెద్దగా లేవు. ఉద్యమ సమయంలో ప్రజా క్షేత్రంలో యాక్టివ్ గా కనిపించిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష , ప్రభుత్వ ఏర్పాటు కనీసం భారీ మీటింగ్ లతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేయలేదు. పథకాలు ప్రారంభించే సమయంలో చిన్న చిన్న సభలు జరిపినప్పటికీ అవి ప్రజా బలాన్ని నిరూపించే విధంగా లేవు. దీంతో ఇప్పటికే సగం పాలన ముగియటంతో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టబోతున్నాడని సమాచారం.
ఇందుకోసం త్వరలో గ్రామ సభల పేరుతో ప్రజల వద్దకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని కొనసాగుతున్న పాలనతోపాటు, మంత్రులు తమ నియోజకవర్గాల్లో సరిగ్గా పని చేయటం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు భోగట్టా. గతంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ప్రజల వద్దకు పాలన కార్యక్రమం లాంటిదే ఒక దానిని ఫ్లాన్ చేస్తున్నాడంట.
ఎన్టీఆర్ లాగే తాను ప్రజల మనిషినంటూ తెలియజేప్పే విధంగా రోడ్ షోలు ఫ్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు ప్రజలకు అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే భరోసా కల్పించేందుకు కూడా ప్రయత్నాలు అల్రెడీ మొదలుపెట్టేశాడు కూడా. ఆధునిక వసతులతో కూడిన ఓ బస్సును అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇంత కాలం క్యాంప్ ఆఫీస్ కు పరిమితం కావటంతో ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత బాగానే పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దానిని తగ్గించటంతోపాటు ప్రతిపక్షాలకు ఆస్కారం ఇవ్వకుండా ఈ రెండేళ్లు అదే పనిలో ఉండబోతున్నాడని తెలుస్తోంది.
మరోవైపు అదే సమయంలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయాలంటూ ఇప్పటికే కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయటం ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. ఇక నగర బాధ్యతలను, ఇక్కడ ిపాలనను తనయుడు కేటీఆర్, మిగతా మంత్రుల చేతిలో పెట్టబోతున్నాడని లీకులు అందుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more