నల్ల కుబేరుల భరతం పట్టేందుకు దేశ ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు సంచలన నిర్ణయం అభినందనీయమే. అయితే ఇది ఆర్థిక పురొగతికి సహకరించే విషయం పక్కనబెడితే ఎంత మేర ముఖ్య లక్ష్యాన్ని చేరుకుందన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఆర్బీఐ రోజువారీ లెక్క వెలువడిన తర్వాతే రాత్రి పూట నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే వెసులు బాటు లేని సమయం చూసి మోదీ జాతి నుద్దేశించి ప్రసంగిస్తూ ప్రకటన చేశాడు. అర్థరాత్రి నుంచే నోట్లు చెల్లవని చెబుతూ నోట్లను మార్చేందుకు షరతులు కూడా పెట్టేసింది బ్యాంకు. అయితే ఉన్న ఆ కాస్త సమయాన్ని కూడా వదలని నల్ల బాబులు వైట్ లోకి ఎలా మార్చేసుకున్నారన్న విషయం ఇప్పడిప్పుడే వెలుగులోకి వస్తోంది.
అంత పెద్ద మొత్తంలో సొమ్ము మారాలంటే ఉన్న ఏకైక మార్గం బంగారం కొనుగోలును ఆశ్రయించారు. ఒక్క హైదరాబాద్ లోనే సుమారు 1000 కోట్లకు పైగా బంగారం విక్రయించేశారు వ్యాపారస్థులు. ముఖ్యంగా ఐదు ప్రముఖ దుకాణాల్లో ఏకంగా రూ.470 కోట్ల మేర పసిడి విక్రయాలు జరిగాయి. సుమారు 25 కోట్లతో ఓ ప్రముఖ మీడియా అధిపతితో పాటు, యూత్ లో పిచ్చ క్రేజ్ ఉన్న టాప్ హీరో సతీమణి కూడా బంగారం కొన్నవారిలో ఉన్నట్లు అధికారులు లీకులు ఇచ్చేశారు.
తమకు రెగ్యులర్ కస్టమర్లు అయిన ఆ సెలబ్రిటీలు ఫోన్లు చేయటంతో మూతపడాల్సిన షాపును అర్థరాత్రి దాటాక కూడా ఓపెన్ లో ఉంచి తమ బిజినెస్ కానిచ్చేసుకున్నారు సదరు షాపు యాజమానులు. ముఖ్యంగా పంజాగుట్టలోని ఓ ప్రముఖ జ్యువెల్లరీ షాపులో కేవలం రెండే రెండు గంటల్లో 50 కోట్ల బంగారం అమ్ముడుపోయింది. స్టాక్ లేకపోయినా వేరే షాపుల నుంచి తెప్పించి మరీ వారు ఈ వ్యవహారం నడపటం విశేషం.
ఎలా వెలుగు చూసింది...
బ్యాంకుల నుంచి ఆయా షాపు యాజమాన్యాలు చేసిన డిపాజిట్ సొమ్ము మాములగా కన్నా ఎక్కువ మొత్తంలో ఉండేసరికి అనుమానం వచ్చిన బ్యాంకులు ఐటీ శాఖకు సమాచారం అందించాయి. లెక్కలను చేజిక్కిచుకున్న ఆదాయపు పన్నుల శాఖ ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పజెప్పింది. నవంబర్ 8 నుంచి వారం పాటు జరిగిన లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు రంగంలోకి దిగిన నిఘా వ్యవస్థకు ఊహించని షాకులే తగిలాయి.
తప్పుడు బిల్లులతో రెండు లక్షల కంటే తక్కువ బిల్లులు వేసి ముక్కు మొహం తెలియని వారి పేరు మీద(రెండు లక్షలు దాటితే పాన్ వివరాలు ఇవ్వాలి కదా) రిసిప్టులు తయారు చేయించారని వెలుగు చూసింది. సీసీ పుటేజీల ఆధారంగా ఆయా సెలబ్రిటీల బాగోతం వెలుగు చూడటంతో షాపు యాజమాన్యాలు నీళ్లు నమిలాయి. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నట్లు తెలియటంతో పూర్తి నివేదిక తయారు చేసిన సీబీఐ ఇప్పటికే దానిని ఐటీ శాఖకు అప్పజెప్పిందని సమాచారం.
‘‘కోట్లలో ఉన్న పెద్ద నోట్లతో బంగారం కొన్నవారి వివరాలు తెలుసుకుంటున్నాం. వారికి నోటీసులు ఇవ్వడానికి ముందే మేం వ్యూహాత్మక అడుగులు వేస్తాం. ఆ తర్వాతే వారిని ఎలా దారికి తీసుకురావాలో ఆలోచిస్తాం’ అని ఓ ఐటీ శాఖ అధికారి తెలిపారు. అయితే షాపు యాజమాన్యాలు కూడా ఎవరెంత బంగారం కొన్నారన్న విషయం చెప్పకపోవటంతో ఆ వివరాలేవీ పొందుపరచలేకపోయామని తెలిపిన అధికారులు. వారి పేర్లను బహిర్గతం చేసేందుకు నిరాకరించారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more