తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు హై లెవల్ కి చేరుకున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు ముందు దానం లాంటి కీలకనేతను సైడ్ చేయటంపై గరం అయిన సీనియర్లు మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే జూనియర్ నేతలతో వారికి పొసగడం లేదన్న సంకేతాలను అధిష్ఠానం దృష్టికి చేరవేస్తున్నారు. పైగా వరుస ఓటములతో కోలుకోలేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ వైఫల్యానికి కారణం మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకొంటూ బజారుకెక్కుతున్నారు. ఈ అంతర్గత కుమ్ములాటలతో సొంత పార్టీనే తిట్టి పోస్తూ రచ్చ చేస్తున్నారు.
సర్వే సత్యనారాయణ నుంచి మొదలైన ఈ దూషణల పర్వం దామోదర రాజనర్సింహ, తాజాగా నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల దాకా కొనసాగింది. దీంతో సీరియస్ అయిన అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. పార్టీ నాయకత్వం పేలవంగా ఉందని జానారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం ద్వారా తీవ్ర దుమారం రేపారు సర్వే సత్యనారాయణ. అయితే ఆపై అధిష్ఠానం వార్నింగ్ తో సైలెంట్ అయిపోయాడు. ఇక మరో నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఒక కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు, మీడియా యాజమాన్యాలను దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మీడియా తమను పట్టించుకోవడం లేదని భావిస్తున్న కాంగ్రెస్ కి ఈ వ్యాఖ్యలు మీడియాను మరింత దూరం చేసిందని కాంగ్రెస్ భావించింది. ఇక మరో నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏకంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిన చాతకానివాడంటూ వ్యాఖ్యానించడంతో పార్టీ ఆయనకు షోకాజు నోటీసు జారీ చేసింది.
ఇక ఇవి చాలవన్నట్లు తాజాగా కాంగ్రెస్ ఓటమికి సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్రెడ్డి లాంటి నేతలే కారణమని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించటంతో ఈ కుమ్ములాటకు మరింత ఊపు వచ్చింది. జానా రెడ్డిని పరుష పదజాలంతో పాల్వాయి తిట్టిపోయడంపై షబ్బీర్ కూడా కాస్త ఘాటుగానే కౌంటర్ వేశాడు. దీనిపై పాల్వాయి స్పందిస్తూ బచ్చాగాళ్లు తనను ఎమన్నా పట్టించుకోనంటూ తెల్చేశాడు. పార్టీలో ఉన్న పనికిమాలిన వాళ్లు, కోవర్టుల వల్లే ప్రతిష్ట అణగారిపోతుందంటూ మళ్లీ జానారెడ్డిని టార్గెట్ చేసే వ్యాఖ్యానించాడు. దీంతో ఇంతకాలం దాగున్న గ్రూప్ రాజకీయాలు ఈ వ్యాఖ్యలతో తారాస్థాయికి చేరేలా ఉన్నాయి. దీనికి తోడు సీనియర్లు ఎవరికి వారే కాబోయే ముఖ్యమంత్రుల మంటూ ప్రకటించుకుంటున్నారని కోమట్ రెడ్డి చెప్పటం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తుంది. జంపింగ్ విషయం అటుంచితే అసహనంతో ఒకరినొకరు దూషించుకోవడమే ద్వారా వ్యక్తిగత ఇమేజ్ డామేజ్ అవ్వటంతోపాటు, పార్టీని నిండాముంచే పరిస్థితులు దాపురించాయి.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more