ఆంధ్ర ఆవిర్భావ దినాలను కాస్త రాష్ట్ర సంతాప దినాలుగా మార్చేసి నవ నిర్మాణ దీక్ష అంటూ కలరింగ్ ఇచ్చేశాడు ఏపీ చంద్రుడు. విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజలతో ప్రమాణం చేయించి సగర్వంగా తలెత్తుకునే రోజు కోసం కృషి చేద్దామంటూ పిలుపునిచ్చాడు. కానీ, ఈ దీక్ష ద్వారా ఎవరికి, ఏం ఒరిగిందన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అప్పులతో తరిమారని, కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చామని చెప్పుకొస్తున్న ఆయనకి కేంద్రాన్ని నిలదీసే దమ్ము ఏపాటి ఉందో ఈ వారం రోజులోనే అర్థం అయ్యింది. సూటిగా ప్రశ్నించకుండా నేరాన్ని యూపీఏపైకి నెట్టేసే ప్రయత్నం చేయడం అభినందనీయమే అయినప్పటికీ రాబోయే సవాళ్లను ఎదుర్కొవటం మాత్రం చాలా కష్టమే.
ఇదిలా ఉండగానే కడపలో బుధవారం ఆయన నిర్వహించిన మహా సంకల్ప సభ ఎందుకో ఎవరికీ అంతుబట్టడం లేదు. పైగా చెప్పిందే చెప్పి పదే పదే విసిగించడం తప్ప ఆయన కొత్తగా చేస్తుందేంటో అర్థం కావటం లేదు. అదే అప్పులు, అదే కట్టుబట్టల ప్రకటనలతో నవనిర్మాణ దీక్ష సీడీని రీప్లే చేసినట్లు ఉంది. పైగా ఎక్కడికెళ్లినా ఈ హైదరాబాద్ డబ్బాను వదలరా బాబు... అంటూ సొంత నేతలే చాటుగా జోకులేస్తున్నారు. ఈ మహాసంకల్ప దీక్షను పరిశీలిస్తే గనుక అనంతపురంలో ప్రతిపక్ష నేత నిర్వహించిన రైతు భరోసా యాత్రకు పోటీగా చేసినట్లు ఉంది. జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో భారీ బహిరంగ సభ పెట్టడం ద్వారా పంటికి పన్ను అన్న సిద్ధాంత బ్యాలెన్స్ చేసినట్లు ఫీలయిపోతున్నారేమో! కానీ, కావాల్సింది అది కాదు.
పైగా ఉద్వేగభరిత ప్రసంగంలో అదనంగా ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లను చూసి తానెందుకు భయపడతానంటూ ఆయన ప్రజల్నే ఎదురు ప్రశ్నించారు. నిప్పులాంటి మనిషినని ప్రకటించేసుకున్న బాబు దేనికి భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. కానీ, భయపడాలి... ప్రజలకు భయపడాలి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేమోనని భయపడాలి. ఆ భయంతోనే నవ్యాంధ్రను దేశంలో నంబర్ వన్ గా చేయాలన్న కసితో పనిచేయాలి. ఎలాంటి సాయం అందించకుండా, సమీప భవిష్యత్తులో కూడా అందిస్తుందన్న నమ్మకంలేని తరుణంలో కేంద్రం దిమ్మ తిరిగేలా అభివృద్ధి చేసి చూపించాలి. అంతేగానీ దీక్షలు, ప్రతిజ్ణల ద్వారా కాలయాపన, అనవసరపు ఖర్చు తప్ప ప్రజల్లో గుప్పెడంతా గుండెల్లో మనోధైర్యం సగం చెంచా కూడా నిండదని గుర్తుంచుకోవాలి.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more