బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అత్యంత ఆర్భాటంగా తెరలేపిన ప్రచారం అప్పడే వివాదాస్పదం అయ్యింది. అసలు విషయం తెలియక అక్కున చేరిన దళితులు కాస్తా ఇప్పుడా పార్టీకీ దూరం అయ్యే అవకాశాలు వున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకీ వచ్చే ఏడాది రానున్న ఎన్నికల కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి చాప కింద నీరులా ప్రచారాన్ని ప్రారంభించి.. వెళ్తూ వెళ్తూ దళితుల ఇళ్లలో బోజనం చేసి దళితుల ఓట్లను కూడగట్టుకుందామనుకున్న అమిత్ సా అశలపై బీఏస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి నీళ్లు చల్లింది.
అమిత్ షా దళితులతో కలిసి భోజనం చేసిన వ్యవహారంలో అసలు విషయాన్ని నిజం నిలకడగా తెలుస్తుందన్నట్లు అమె వెల్లడించి మరో మలుపు తిప్పారు. అమిత్ షా కోసం దళితుల ఇంట్లో ఏర్పాటు జరిగిన మాట వాస్తవమని చెప్పిన అమె, అక్కడ వంట చేసిన మనిషి మాత్రం దళితుడు కాదని చెప్పారు. అమిత్ షా కోసం వంట చేసింది అగ్రకులస్తుడేనని, తద్వారా బీజేపీ తన దళిత వ్యతిరేకతను మరోసారి రుజువుచేసుకుందని అమె ఆరోపించారు. నిజాలు నిగ్గుతేల్చేందుకు సదరు వంటమనిషి కోసం గాలించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి పార్టీ శ్రేణులను ఆదేశించినట్లు తెలిసింది.
అయితే షాతోపాటు ఆ కార్యక్రమానికి 250 మంది బీజేపీ నేతలు తరలివచ్చారు. వారిలో 50 మంది మాత్రమే భోజనం చేశారని, ఎంపిక చేసిన ప్రదేశం.. వెనుకబడిన తరగతికి చెందిన బింద్ కులస్తుల ప్రాబల్యం ఉన్నదని, అలాంటప్పుడు దళితుల ఇళ్లలో భోజనం చేశామని ప్రచారం చేసుకోవడం ఏమేరకు సబబు? అని వారణాసి జోనల్ బీఎస్సీ నేత డాక్టర్ రామ్ కుమార్ కురేల్ విమర్శించారు. అతి త్వరలోనే వంటమనిషి జాడ తెలుస్తుందని, అప్పుడు అమిత్ షా ఆడిన నాటకం బయటపడుతుందని ఆయన అన్నారు.
ఇదిలా వుండగా ధళితుల ఇంట అమిత్ షా బోజనం చేయాడాన్ని కూడా రాజకీయం చేయడం అంత దుర్మార్గం ఏమీ లేదని బీజేపి నేతలు వాదిస్తున్నారు. అయితే దళితుల ఇంటి బోజనం చేశామని చెప్పుకుని ప్రచారం చేసుకోవడం బీజేపి నేతల దుర్మార్గమని, అంతకన్నా పెద్ద తప్పు ఏంటంటే ధళితుల ఇంట బోజనం మాట అటుంచింతే.. వంట చేసిన మనిషి మాత్రం అగ్రకుల వర్ణానికి చెందిన వ్యక్తన్న విషయాన్ని దాచి పెట్టి ప్రచారం చేయడం కన్న దుర్మార్గమేముంటుందని బీఎస్పీ నేతలు తిప్పికోడుతున్నారు. మరి బీఎస్పీ నేతలకు వంట మనిషి దోరికేనా అన్నది పెద్ద ప్రశ్నగానే మారింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more