నాలుగో అభ్యర్థి టెన్షన్ పెట్టి చివరకు పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంది టీడీపీ. దీంతో ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి లైన్ క్లియర్ అయినట్లు అయ్యింది. ఆ పార్టీ తరపున ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి బరిలో దిగి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు పోటీగా అభ్యర్థులు ఎవరూ లేకపోవటంతో ఆయన భార్య సునందారెడ్డి తో మరో నామినేషన్ వేయించారాయన. పోటీకి ఎవరూ రానీ తరుణంలో పోటీ నుంచి విత్ డ్రా చేయించడం ద్వారా ఆమెను ఓ డమ్మీ అభ్యర్థిగానే నిలబెట్టి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ, దాని వెనక ఓ చిదంబర రహాస్యం ఉందని ఇప్పుడు తెలుస్తోంది.
విజయసాయిరెడ్డి మూడు సెట్ల నామినేషన్లు వేశాక ఆ వెనువెంటనే భార్యతో కూడా నామినేషన్ దాఖలు చేయించారు. ఆమెను వెంటపెట్టుకుని మరీ అసెంబ్లీకి వచ్చి తనకు పోటీగా నిలిపారు. మరో కోణంలో ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల ఆరోపణలపై కేసులున్న సంగతి తెలిసిందే. ఈ కేసులన్నింటిలో విజయసాయిరెడ్డి రెండో నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతానికి బెయిల్ పై వీరంతా బయట ఉన్నారని అందరికీ తెలిసిందే. కాగా, ఆయా కేసులన్నీ ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. వారిపై నమోదైన ఏ ఒక్క కేసులోనూ తుది తీర్పు వెలువడలేదు.
అంటే తుది తీర్పు వెలువడే దాకా విజయసాయి రెడ్డి నిందితుడిగానే ఉంటాడు తప్ప దోషి మాత్రం కాదు. ఒకవేళ నామినేషన్ పరిశీలన సమయంలో ఎన్నికల అధికారి ఏమైనా అభ్యంతరాలు చెప్పితే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని ఆయన గమనించారంట. అసలే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయనకు ఈ కేసులు ఎక్కడ ఇబ్బందిపెడతాయోనన్న ఆలోచనతోనే భార్యతో డమ్మీ నామినేషన్ వేయించాడని తెలుస్తోంది. అంటే ఒకవేళ విజయసాయిరెడ్డిపై అభ్యంతరాలు వ్యక్తం అయితే ఆ స్థానంలో ఆయన భార్యను రాజ్యసభ బరిలో నిలపాలన్నది వైసీపీ వ్యూహం అన్నమాట. కానీ, సాయిరెడ్డి నామినేషన్ కు రిటర్నింగ్ అధికారి ఓకే చెప్పడం, నాలుగు సీట్లకు బరిలో నలుగురు మాత్రమే నిలిచిన నేపథ్యంలో సునందారెడ్డి చివరి నిమిషంలో తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. అది అసలు సంగతి.
బాస్కర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more