ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే తన కొడుకు నారా లోకేష్ కు మంత్రిమండలిలో చోటు కల్పిస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడుకు తాను ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసినప్పుడే లోకేష్ ను మంత్రిని చేసే అవకాశం ఉన్నా కానీ ఎందుకు చెయ్యలేదు అని కొంత మంది అనుమానం. ఇప్పుడు ఎందుకు అకస్మాత్తుగా ఏపి కేబినెట్ లోకి లోకేష్ అనే దానికి ఆ పార్టీ సీనియర్లు చెబుతున్న మాటలు వింటే షాకవ్వాల్సిందే. టిటిడిపి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సూచనతోనే లోకేష్ మంత్రిమండలిలో చోటు అనే అంశం ఊపందుకుందని తెలుస్తోంది.
ఏపి మంత్రివర్గంలో మంత్రుల కన్నా కూడా తన కొడుకు నారా లోకేష్ కు చోటు కల్పించడం ద్వారా డైరెక్ట్ గా పార్టీ మీద. ప్రభుత్వం మీద పట్టుసాధించవచ్చని చంద్రబాబు నాయుడు ప్లాన్. అందులొ భాగంగానే చంద్రబాబు నాయుడు ఈ స్టెప్ తీసుకుంటున్నారట. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ పాలనలో దూసుకెళుతున్నారని, అలాగే ఏపిలో లోకేష్ కు కూడా అలాంటి ఇమేజ్ రావాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ వేస్తున్నారట. అయితే ఓ పక్క కేటీఆర్ ను ఉదాహరణగా తీసుకుంటూనే మరోపక్క రాహుల్ గాంధీని కూడా ఉదాహరణగా చూపిస్తున్నారట.
ఎలా ఉండాలి అనే దానికి కేటీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలని లోకేష్ కు నారా చంద్రబాబు నాయుడు సూచించారట. అలాగే చిన్న చిన్న తప్పులు మొత్తంగా వెరసి పెద్ద తప్పుగా, ఎన్నటికీ చెరిగిపోనిది మారుతుందని చెప్పడానికి రాహుల్ గాంధీని ఉదాహరణగా చెబుతున్నారట. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దాలి అనే మాటను చంద్రబాబు నాయుడు బాగా పాలోఅవుతున్నట్లున్నారు. అందుకే తమ ప్రభుత్వం మంచి పొజీషన్ లో ఉన్నప్పుడే లోకేష్ కు ఏదో మంచి చెయ్యాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ వేస్తున్నారట.
-Abhinavachary
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more