తెలంగాణలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇబ్బందులను కొన్నితెచ్చుకుంటుందా అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికలలో విజయదుంధు:భి మ్రోగించిన పార్టీ.. ఇంతకు మునుపెన్నడూ పోటీ చేయని గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక మండలి ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేని మెజారిటీ సాధించిన పార్టీకి ఇబ్బందులా..?. అవును నిజంగా ఇబ్బందులే. అవి కూడా స్వయం కృపారాధాలేనన్న వాదనలు కూడా వినబడుతున్నాయి.
గ్రేటర్ ఎన్నికలలో అనుభవం లేకున్నా ఏ వార్డు నుంచి ఏ అభ్యర్థి విజయం సాధిస్తారన్న అంచనాలతో ఆయా అభ్యర్థులను తమ పార్టీ తరపున టిక్కెట్లను ఇచ్చి ఆ ఎన్నికలలో నల్లేరుపై నడక రీతిలో విజయాన్ని సాధించిన టీఆర్ఎస్ తజాగా వరంగల్ కార్పరేషన్ ఎన్నికలు మాత్రం ఇబ్భందులను తెచ్చిపెడుతున్నాయి. అక్కడ కూడా గ్రేటర్ హైదరాబాద్ తరహా ఫార్ములాతో రాణించాలనుకుంటున్న టీఆర్ఎస్ కు సోంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులు తల్లెత్తనున్నాయి. కార్పోరేషన్ ఎన్నికలలో ఇతర పార్టీల నేతలను పార్టీలలోకి ఆహ్వానిస్తూ.. వారికి పెద్దపీట వేయడంతో పార్టీ అవిర్భావం నుంచి వున్న తమను ప్రాధాన్యం నశిస్తుందని పార్టీ సీనియర్ నేతలు అలకూనుతున్నారు.
పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తమను కాదని, ప్రత్యర్థులను ఎందుకు ప్రసన్నం చేసుకుంటున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే పార్టీ ప్రస్తుతం అధికారంలో వుంది కాబట్టి.. ఎవ్వరూ ధైర్యంగా ధిక్కంరించే ధైర్యం చేయలేక పోతున్నారు. అయితే వారిలో అసంతృప్తి మాత్రం రగులుతుంది. కాగా వచ్చే ఎన్నికల నాటికి ఇది తారాస్థాయికి చేరడంతో పాటు అప్పడు టిక్కెట్లు రానీ నేతలు కూడా రెబెల్స్ రాగం అందుకుంటే.. ప్రస్తుతం బలంగా దూసుకెళ్తున్న పార్టీకి బీటాలు వారే ప్రమాదముందన్న వాదనలు వినబడుతున్నాయి.
తాజాగా వరంగల్ వెస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అసంతృఫ్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. పార్టీలోకి వరుస చేరికలతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని ఆయన ఆవేదన చెందినట్లు సమాచారం. కార్పొరేషన్ టికెట్ల విషయంలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని వినయ్ భాస్కర్ సహచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకరరావు, తాజాగా మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more