Rajaiah replaced with Sarve in Warangal Lok sabha By-polls

Does rajaiah replacement workout for congress in warangal by polls

Siricilla Rajaiah, Siricilla Rajaiah family members, Siricilla Rajaiah fire accident, Siricilla Rajaiah unable to contest elections, Siricilla Rajaiah requests party to change his candidature, rajaiah warangal by polls, rajaiah family fire accident, siricilla rajaiah daughter in law fire accident, fire accident, four burnt alive, warangal, Siricilla Rajaiah, Warangal bypolls

Telangana PCC replaces Sircilla Rajaiah with Sarve Satyanarayana in Warangal bypolls, does it work out fof the party

కాంగ్రెస్ అభ్యర్థి మార్పు ఎవరికి లాభం.? ఎవరికి నష్టం..?

Posted: 11/04/2015 07:16 PM IST
Does rajaiah replacement workout for congress in warangal by polls

వరంగల్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో పెను విషాదం సంభవించడం అన్యూహ రాజకీయ మార్పులకు కారణమైంది. రాజయ్య కోడలు సారిక తన ముగ్గురు పిల్లలతో సజీవదహనమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. వరంగల్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ను రాజయ్యకు ఇవ్వవద్దని ఆమె కోడలు సాక్షాత్తు సోనియాగాంధీకి లేఖ రాసింది. ఈ విషయమై నిన్న రాత్రి వారి నివాసంలో చోటుచేసుకున్న సంఘటనలు సారిక, అమె ముగ్గురు పిల్లలు ఆత్మహత్యకు కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో తాను ఉపఎన్నికల బరిలో దిగలేనని.. అభ్యర్థిని మార్చాలని రాజ్యయ్య అధిష్టానాన్ని విన్నవించారు. దీంతో వరంగల్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తన అభ్యర్థిని మార్చింది. సిరిసిల్ల రాజయ్యకు బదులుగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణను పోటీలో నిలిపింది కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం.

నిన్న రాత్రి వరకు కాంగ్రెస్ కు అనుకూలంగా కనిపించిన సీన్ మొత్తం ఇప్పడు మారిపోయింది. హఠాత్తుగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మారటం ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో నష్టమా... లాభమా? అని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. వలసొచ్చిన నేత తమను ఎలా అధరిస్తాడని వారు సందిగ్ధంలో వున్నారు. వరంగల్ చెందిన నేతలను కాదని, వలస వచ్చిన నేతలకు అధిష్టానం టిక్కెట్ ను ఇవ్వడంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థి మార్పు అధికార టీఆర్‌‌‌‌ఎస్‌కు లాభిస్తుందా లేక బీజేపీ- టీడీపీ కూటమికి సానుకూలంగా మారుతుందా? అని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.

అయితే అధికార పార్టీ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీలోనే అసంతృప్తి ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దయాకర్ కు టిక్కెట్ ఇవ్వడంపై రాజ్ కుమార్ వర్గీయులు అసంతృప్తితో వున్నారని, ఆయన పేరును ఖరారు చేసిన తరువాత మర్చడంతో స్థానిక నేతలు రెండుగా విడిపోయినట్లు తెలుస్తుంది. వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి, రాజయ్య వర్గీయుల మధ్య విభేధాలు ఆ పార్టీ అభ్యర్థికి చేటు చేస్తాయోమోనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు అధికార టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే వర్గాలు ఏ పార్టీ అభ్యర్థికి మద్ధతు ఇస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.మొత్తం మీద వరంగల్‌ లోక్‌సభ రాజకీయం రసకందాయంలో పడింది. వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థికి విజయం వరిస్తుందో తెలియాలంటే.. ఓటరు తీర్పు కోసం వేచిచూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : siricilla rajaiah  sarve satyanarayan  warangal by polls  congress  

Other Articles