ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ద్వంద నీతికి అంతం ఎక్కడ వుంటుందని వెతికినా.. కనబడే మార్గాలు మాత్రం అదృశ్యమవతున్నాయి. రెండు రాష్ట్రాలు విడిపోయినా.. తెలుగు ప్రజలు అందరూ ఒక్కటేనని చెప్పిన చంద్రబాబు.. రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్లని తన రెండు కళ్ల సిద్దాంతమే చివరకు గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేసిన ఆయన.. తన ద్వంద నీతిని మాత్రం విడవటం లేదు. విపక్షంలో వున్న సమయంలో ప్రభుత్వంలో వున్నవారు అధికారమే పరమావధిగా పావులు కదుపుతున్నారని గగ్గోలు పెట్టిన ఆయన సమైక్యరాష్ట్రంలో తొమ్మిదేళ్లు అధికారంలో వున్నపుడు చేసిందదేనని, ఇప్పడు ఏపీకి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన చేస్తున్నది అదేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లుగా మాటల్లో కోటలను దాటిస్తున్న చంద్రబాబు.. నిజానికి చేస్తున్నది మాత్రం వేరోకటి. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు ప్రాంతీయ అభివృధ్ది కోణంతో.. తెలంగాణ అనేక దశాబ్ధాలుగా అన్యాయానికి గురైందన్న విమర్శలతోనే ప్రత్యేక తెలంగాణకు పునాదులు పడ్డాయి. తెలంగాణ వనరులు, తెలంగాణ నీళ్లు, ఉద్యోగాలు, ఇలా అన్ని దోపిడికి గురయ్యాయని కేంద్రం బావించిన తరుణంలోనే తెలంగాణను 29వ రాష్ట్రంగా ప్రకటించింది. అయితే రాష్ట్ర పునర్విభజనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడినా.. తనకు రెండు రాష్ట్రాలు సమానమని చెప్పే చంద్రబాబు దందనీతి మరోమారు బట్టభయలు అయ్యింది.
తెలంగాణ వ్యాప్తంగా తనకు అధికంగా పట్టువున్న మహబూబ్ నగర్ జిల్లాలలోని పాలమూరు ప్రాజెక్టు సహా, నల్లగొండ ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులని, వీటిని అనుమతి లేకుండా చేపడుతున్నారని కేంద్రానికి లేఖ రాయడంపై తెలంగాణ వాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర సమానమేనన్న చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చెప్పేదోకటి, చేసేదోకటని ఆయన చర్యలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు కళ్ల సిద్దాంతం అని చెప్పుకునే బాబు.. తన ఒక కంట్లో నలుసు పడినా, దులాలు పడినా.. పట్టించుకోకుండా.. మరో కంటో మాత్రం ముందస్తు జాగ్రత్తాను పాటిస్తున్నారు. ఇటు తెలంగాణ జలప్రాజెక్టులపై అక్కస్సును వెళ్లగక్కుతున్న బాబు.. అటు సీమాంధ్ర ప్రాజెక్టులను మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారు.
ఈ విషయన్ని స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సన్వర్లాల్ జాట్ పార్లమెంటులో స్పష్టం చేయడంతో విషయం వెలుగుచూసింది. పట్టిసీమ పోలవరంలో భాగం కాదని.. అసలు పట్టిసీమ ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ తమకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి ప్రతిపాదనలు పంపకుండానే, కేంద్రం నుంచి ఆమోదం పొందకుండానే ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సన్వర్లాల్ జాట్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కాగా ఇన్నాళ్లు ఈ ప్రాజెక్టు పోలవరంలో భాగమని చెప్పి.. ఎన్ని అవాంతరాలు ఏర్పడినా ఈ ప్రాజెక్టును నిర్మాణ చేస్తామని చంద్రబాబు చెప్పారు. గోదావరి నదిలో నీళ్ళు కృష్ణాబేసిన్కు తరలించడానికే పట్టిసీమ నిర్మిస్తున్నామని ఇన్నాల్లు చెప్పుకోచ్చిన చంద్రబాబు నోట్లో పచ్చివెలకాయ పడినట్లు అయ్యింది. దీంతో బాబు ద్వంద నీతి మరోమారు బట్టభయలైయ్యింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more