తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటుకు వ్యవహారంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కీలకనేతను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియోటేపులను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే తాజా పరిణామాలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ట్యాపింగ్ వ్యవహారంలో టిఆర్ఎస్ ఇరుక్కుంటోందా..? అంటే అవును అన్నట్లే ఉంది పరిస్థితి. అయితే ఇప్పిటికే నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో ప్రధానితో సహా, పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. తెలంగాణ ప్రభత్వం ట్యాపింగ్ కు పాల్పడింది అన్న విషయాన్ని ఆధారాలతో సహా వివరించినట్లు తెలుస్తోంది.
ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబువే నని టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా వాదిస్తే, ఆ ఆడియో టేపులు ఎక్కడివి? ఫోన్ ట్యాపింగ్ చేసినవా? అన్న సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డామంటే కేంద్ర టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్ కు సమాధానం ఇవ్వాలి. ఇప్పటికే ఈ విషయంలో ఆయన గుర్రుగా ఉండటమే కాకుండా, ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేయడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ చంద్రబాబువి కాదని టీఆర్ఎస్ ప్రభుత్వం మెలిక పెడితే మాత్రం రెండు రాష్ట్రాల మధ్య శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినందున, పదేళ్ళ పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ పాలన పోయి గవర్నర్ పాలన వచ్చే అవకాశం ఉంది. అప్పుడు టీఆర్ఎస్ కు మరిన్ని చిక్కులు తప్పవని చెప్పవచ్చు. రేవంత్ కేసు విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా పట్టుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు కు ప్రతిపక్షాల నుంచి విమర్శలు తప్ప పెద్దగా ఒరిగేది ఏమీలేదని, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఏపీ ప్రభుత్వం గట్టిగా పట్టుకుంటే మాత్రం టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తో పాటు, తెలంగాణ ప్రభుత్వానికి చిక్కులు తప్పవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more