ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహర శైలి అయిన వారికి అకుల్లోను కాని వారికి కంచాల్లోనూ అన్నట్లు వుంది. ప్రభుత్వ ఉద్యోగులను ఒకళా మరోవైపు ఆర్టీసీ కార్మికులను మరోలా చూడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వారం రోజులుగా తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతున్నా ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కార్మికులు సమ్మె చేస్తున్న తొలిరోజు నుంచే చర్చల ప్ర్రక్రియ కోనసాగించివుంటే.. ఈ పాటికి సమస్య పరిష్కారమయ్యేదని, ప్రజలు ఇన్నాళ్లుగా ఇబ్బందులు పడుతున్నా.. అటు ప్రభుత్వం కాని, ఇటు ఆర్టీసీ యాజమాన్యం కానీ పట్టించేకోకపోవడంతోనే సమస్య మరింత జఠిలంగా తయారైందని కార్మిక సంఘాల నేతలు అరోపిస్తున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో చేపట్టిన సకల జనుల సమ్మెను తాము మద్దతుగా బస్సు సర్వీసులను నిలిపేనప్పుడు మద్దతు పలికిన పార్టీ.. అధికారంలోకి వచ్చిన తరువాత ప్లేటు మార్చడంపై కూడా కార్మిక సంఘాలు భగ్గమంటున్నాయి. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తాము పాలుపంచుకున్నామన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. మరోవైపు ఆ తరుణంలో వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో తమ ఫిట్ మెంట్ బెనిఫిట్ ను పెంచుతామంటూ టీడీపీ పార్టీ తమకు హహీ కూడా ఇచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణించాలని కార్మిత సంఘాల నేతలు కోరుతున్నారు.
జీతాలు అధికంగా వుంటే ప్రభుత్వ ఉద్యోగులను అందాలన్ని ఎక్కించిన ప్రభుత్వమే.. తమను పక్కన పెడుతుందని ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. సమ్మెకు పక్షం రోజుల ముందు నోటిసు ఇచ్చినా.. స్పందించని ప్రభుత్వాలు.. తమ సమ్మె నేపథ్యంలో ధిగివస్తాయంటున్నారు. తమ పార్టీకి చెందిన నేతలతో హైకోర్టులను ఆశ్రయించి.. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను అణిచివేయాలని చూస్తుందన్నారు. తమను వాడుకుని వదిలేయాలని చూస్తే.. జైళ్లకు వెళ్లేందుకు కూడా సిద్దమంటున్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లను పరిష్కరించినా.. అది తమ సమ్మె గెలుపు అవుతుందే కానీ.. ప్రభుత్వ గోప్పతనంగా మారదని కూడా అంటున్నారు కార్మిక సంఘాల నేతలు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more