తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, ఎంఐఎం పార్టీకి మధ్య ఎన్నికల ముందు నుండి మంచి స్నేహసంబందాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా కూడా కెసిఆర్ ఓవైసీ సోదరులకు అందరి కన్నా ఎక్కువే ప్రధాన్యత ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో చేరకుండా ముస్లిం మైనార్టీలకు చేరువ అయ్యేందుకు చేసిన టిఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు రెండు పార్టీల మధ్య దూరాన్ని బాగా తగ్గించింది. అందుకే రెండు పార్టీల మధ్య సానిహిత్యం కూడా పెరిగింది. అయితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఎన్నిక తర్వాత హైదరాబాద్ అభివృద్దిపై, అందులో చార్మినార్ పాత బస్తీ ప్రాంతంపై మరింత దృష్టి సారించారు.
ఓవైసీ సోదరులకు, వారి పార్టీకి ఎక్కువ పట్టున్న ప్రాంతాల అభివృద్దికి ఎక్కువ నిధులను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలను కూడా తీసుకుంది. అలా రెండు పార్టీలకు చెందిన నేతలు నిన్నటి దాకా పాలు నీళ్లలా కలిసిపోయారు. అయితే తెలంగాణ శాసనసభలో బడ్జెట్ గురించి జరుగుతున్న చర్చ రెండు పార్టీ మధ్య దూరం పెరిగిందా అనే అనుమానాన్ని లేవనెత్తుతోంది. టిఆర్ఎస్ కు మిత్రపక్ష్యంగా బావిస్తున్న ఎంఐఎం పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణ బడ్జెట్ పై పెదవి విరవడం సభలో అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గత బడ్జెట్ కు కాపీ అని అన్నారు. పాత విషయాలనే మళ్లీ ప్రస్తావించారని అన్నారు. అయితే నిన్నటి దాకా మిత్రపక్షంగా భావించిన ఎంఐఎం కి చెందిన కీలక నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఇలా టిఆర్ఎస్ సర్కార్ పై విమర్శలకు దిగడం కొత్త చర్చకు దారిస్తోంది. టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య దూరం పెరుగుతుందా అనే అనుమానాలను రేకెత్తించింది. మరి ఈ అనుమానాలు నిజమా కాదా అని ఓ క్లారిటీ రావాల్సి ఉంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more