కాంగ్రెస్ పార్టీలో మనం గతం కామరాజుల కథలు, వారు చేసిన అక్రమాల కథల గురించి చాలానే విన్నాం!!! కానీ ప్రస్తుతం చర్చించుకోబోయే ఒక నాయకుడి ప్రేమకథ మాత్రం కొంచెం వింతగా వుంటుంది! ఆయన ఏం చెప్పబోతున్నాడో.. ఏం చెబుతున్నాడో.. అసలెందుకు చెబుతున్నాడో.. ఆయన ఉద్దేశం ఏమిటి..? అన్న విషయాలు మాత్రం ఎవ్వరికి తలకెక్కవు! జరిగిన విషయాలను మళ్లీ మళ్లీ తెరపైకి తీసుకొస్తూ.. జరగని విషయాలులాగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద తనకున్న ప్రేమాభిమానం ఏంటో నిరూపించుకున్నాడు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే... ఇతను ప్రేమిస్తున్నది ఏ మహళనో, అమ్మాయినో కాదు... తాను నాయకుడిగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని!
ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ అయిన రాజీవ్ సటావా... తనకు కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత అభిమానమో, ఎంత ప్రేముందో నిరూపించుకోవడానికి నానాతంటాలు పడ్డారులెండి! ‘‘అప్పుడు ఇందిరాగాంధీని విమర్శించారు... తర్వాత సోనియా గాంధీని... అనంతరం ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీని విమర్శిస్తూనే వున్నారు. ఇలా చేయడం ఎంత న్యాయమో మీరే చెప్పండి’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొంతమంది కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన పరోక్షంగా అన్నిపార్టీలవారిని ఆరోపించారు.
ఇటీవల నట్వర్ సింగ్ పుస్తకంలో సోనియా, రాహుల్ ప్రస్తావన దేశంలో పెద్ద దుమారంగా అయిన సందర్భంలో కాంగ్రెస్ వర్గాలు ఎదురుదాడికి దిగిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే సటావా మీడియాతో మాట్లాడుతూ... తమకు సోనియా, రాహుల్ అన్ని విషయాల్లోనూ మార్గదర్శకులుగా తమ విధేయతను చాటుకున్నారని, అటువంటి నాయకులు ఎక్కడా లభించరని ఆయన ప్రకటించేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకోసం ఎన్నో పథకాలను అమలు చేసిందని... పెద్దపెద్ద సిటీలను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ దే కీలకపాత్రని ఆయన వెల్లడించారు.
‘‘1977లో షా కమిషన్ సాయంతో ఇందిరాగాంధీని వేధించారు. 1999లో సోనియా స్థానికతను ప్రశ్నించారు. ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీని లక్ష్యం చేసుకుని తిట్టరాని తిట్లు తిడుతున్నారు. మాపై దాడి జరిగిన ప్రతిసారి మేము ధీటుగానే నిలబడ్డాం. ఇదే కాంగ్రెస్ పార్టీ బలం’’ అని సటావా వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి అంశంపైనా నియంత్రణకోసం పాకులాడుతోందని.. పేదలకోసం కాకుండా ‘‘ట్విటర్ సర్కార్’’లా తయారైందని ఆయన బిజేపీని విమర్శించారు. సామాన్యుడిని ప్రభావితం చేసే ప్రతి అంశంపైనా తాము ముందుండి పోరాడుతామని ఆయన పేర్కొన్నారు.
గతంలో జరిగిన విషయాలు, కాంగ్రెస్ పార్టీ మీద వెల్లువెత్తుతున్న విమర్శల విషయాల గురించి ఆయన వివరించడం బాగానే వుంది కానీ... ఆయన ఏ ఉద్దేశంతో ఇలా వ్యాఖ్యానించాడో అర్థం కావడం లేదురో ముర్రో అంటూ రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా.. ఈయనకు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత అభిమానం వుందో... ఆ పార్టీ మీద తనకెంత ప్రేముందో ఇలా మాటల ద్వారా వ్యక్తపరిచాడని అనుకుంటున్నారు. దీంతో అందరూ... అందరూ కాంగ్రెస్ నాయకుడిలాగే ఇతనిది కూడా ఇదో వింత కథ అంటూ అందరూ గుసగుసలాడుకుంటున్నారు!
AS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more