జగన్ పార్టీ నుండి జంప్ చేసే జిలానీలకు.. ఎన్నికల సంఘం కోరడా ఝులిపించింది. ఒక పార్టీ నుంచి గెలుపొంది మరో పార్టీలో చేరాలనుకునే వారికి..ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ఓ పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై.. మరో పార్టీ తీర్థం పుచ్చుకుంటే వేటు తప్పదని స్పష్టం చేసింది. అంతేకాదు..ఆ పార్టీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగినా...అనర్హత తప్పదందని ఈసీ చెప్పటం జరిగింది.
ఈ కామెంట్స్ వైసీపీకి బూస్ట్ ఇచ్చినట్లైయితే...జంపింగ్ జిలానీల ఆశలపై మాత్రం నీళ్లు చల్లింది. పార్టీకి గుర్తింపు లేదు.. జంప్ చేయడానికి ఇదే కరెక్ట్ టైమ్ అనుకున్నారు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి. అందుకే ఫ్యాన్ పార్టీని వదిలి సైకిల్ ఎక్కేశారు. కానీ, వేటు తప్పదని ఈసీ చెప్పేసరికి.. ఆయన తర్వాత క్యూలో ఉన్న బుట్టా రేణుక మాట మార్చారు.. టీడీపీలో చేరడం లేదని.. మద్దతు మాత్రమే ఇస్తానన్నారు. తన భర్త నీలకంఠం... టీడీపీలో చేరడం ఆయన వ్యక్తిగతమంటూ మాట మడతేశారు.
కర్నూలు జిల్లా అభివృద్ధి కోసమే తాను టీడీపీతో కల్సి పనిచేయనున్నట్లు చెప్పుకొచ్చారు రేణుక. టీడీపీ అనుబంధ సభ్యురాలిగా కొనసాగుతానన్న బుట్టారేణుకకు కూడా ఈసీ షాక్ ఇచ్చింది. ఓ పార్టీ నుంచి గెలిచి.. మరో పార్టీకి మద్దతిస్తే.. ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి భవిష్యత్ ఏమిటన్నదానిపై రెండు పార్టీల్లోనూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. పార్టీ మారినందుకు ఎస్పీవై వేటు పడుతుందా.. లేక.. ఆయన టీడీపీ ఎంపీగా చెలామణీ అవతారా అన్నది ఫలితం తేలవరకూ ఉత్పన్నమయ్యే ప్రశ్నేగానే కనిపిస్తోంది.
ఎస్పీవైరెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా యనమల మాట్లాడుతూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లేదని.. అందువల్ల పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదని చెప్పారు. రాజ్యాంగ నిపుణుల వాదన మాత్రం మరోలా ఉంది. వైసీపీ రిజిస్టర్డ్ పార్టీ అయినప్పటికీ.. ఎమ్మెల్యేలు,ఎంపీలకు ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందంటున్నారు. పార్టీ మారిన ఎంపీలు వైసీపీ ఎన్నికల గుర్తుతో గెలిచినందు వల్ల ... వారిపై అనర్హత వేటు వేసే అవకాశం లేకపోలేదంటున్నారు.
ఈసీ ప్రకటన యనమల స్టేట్మెంట్కు విరుద్ధంగా ఉండడంతో ఎస్పీవైరెడ్డి, బుట్టా రేణుకల భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. మరోవైపు పార్టీ మారడానికి సిద్ధమైన వైసీపీ నేతలంతా ఒక్కసారిగా అంతర్మథనంలో పడిపోయారు. పార్టీ మారిన తరువాత ఎన్నికల సంఘం అనర్హత వేటు వేస్తే... తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని ముందే ఊహించుకుంటున్నారు. వేటు పడి ఉపఎన్నికలకు వెళ్లాల్సి వస్తే.. మళ్లీ గెలుస్తామో లేదో అన్న టెన్షన్తో సతమతమవుతున్నారీ గోడమీదున్న నేతలు.
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికైన శోభానాగిరెడ్డి.. కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనాన్ని వ్యతిరేకించారు. చిరంజీవితో మిగతా ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆళ్లగడ్డ నుంచి ఎన్నికైన శోభానాగిరెడ్డి... పీఆర్పీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..వైసీపీలో చేరారు. తరువాత మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి...ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పడిదే సీన్.. గోడ దూకుదామనుకుంటున్న వైసీపీ నేతలకు తప్పేటట్లు లేదు. ఆపరేషన్ ఆకర్ష్తో.. వైసీపీ నేతలకు భారీగా వల వేయాలనుకున్న సైకిల్ పార్టీకి...ఈసీ నిర్ణయంతో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అయితే వెనకడుగు వేయకుండా, వారిని పార్టీలోకి చేర్చుకొని ఉప ఎన్నికలకు వెళ్లాలనుకుంటోంది .
దీనికి సమ్మతించి ఎంతమంది టీడీపీలో చేరతారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈసీ ప్రకటనతో వైసీపీకి ఉత్సాహం వస్తే.. ఏదో చేద్దామనుకుంటే మరేదో అయ్యిందనుకుంటున్నారు టీడీపీ నేతలు. ఈ రెండు పార్టీల మధ్య త్రిశంకు స్వర్గంలో ఉన్నారు గోడమీదున్న నేతలు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more