రోజా గెలుపే జగన్ కు శాపమైందా? అని అంటే అవుననే అంటున్నారు.. జగన్ పార్టీలోని సీనియర్ నాయకులు, మహిళ నేతలు, పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు ఈ పుకారు పార్టీలో ప్రకంపనాలు పుట్టిస్తుంది. రోజా.. అంటే ఒక్కప్పుడు వెండితెరపై .. ఒక వెలుగు వెలిగింది. చిరంజీవి, బాలయ్య లాంటి స్టార్ హీరోలకు నిద్రలేకుండా చేసిన రోజా గత పది సంవత్సారల నుండి రాజకీయ రంగు పూసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. రాజకీయల్లోకి అడుగుపెట్టిన తరువాత ఆమె జీవితం పై ఐరన్ లెగ్ అని ముద్ర పడింది. రాజకీయ పార్టీలు, నేతలు కూడా ఆమెను ఐరన్ లెగ్ గానే గుర్తించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి పది సంవత్సరాలు తిరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో చంద్రబాబు గానీ, రోజా గానీ పెద్దగా వికసించలేదు. అంటే రోజా తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం.. చంద్రబాబుకు అధికారం దూరమైందని టీడీపీ నేతలు అప్పట్లో గుసగుసలాడుకుంటున్నారు. రోజా ముళ్లు (లెగ్ ) వలనే టిడిపి అధికారంలోకి రాలేదని విమర్శలు ఆ పార్టీ మహిళ నేతల నుండి రావడంతో.. రోజా టిడిపి నుండి స్థానభ్రంశం చెందింది.
అప్పుడు అధికారంలో.. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని కలిసి రోజా తన మనసులోని మాట బయట పెట్టింది. ఆయన రోజా కు గ్రీన్ కార్పెట్ పరచటానికి సిద్దమే అని ఆమెకు అభయ‘హస్తం’ ఇవ్వటం జరిగింది. దీంతో టీడీపీ నాయకులు రోజా శని పోయిందని అనుకున్నారు. అయితే కాంగ్రెస్ నేతలకు, రోజా భయం పట్టుకొని, పెద్దాయనతో రోజా రంగు గురించి వివరించి చెప్పిన ఫలితం లేకుండాపోయిందని అప్పట్లో కాంగ్రెస్ నేతలు చెవులు కోరుక్కున్నారు.
రోజా అడుగుపెట్టిన అతి కొద్ది రోజుల్లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గాలిలో కలిసిపోయి.. ‘రోజా’ పువ్వులు చల్లించుకున్నారు. దీంతో ఆ పార్టీలోని మహిళ నేతలు రోజా ఘోరంగా విరుచుకుపడ్డారు. ఆ సమయంలో రోజా పడిన బాధ అంత ఇంత కాదు. అయ్యో అక్కున చేర్చుకున్న పెద్దాయన కు ఇలా జరిగిందని రోజా కన్నీరు మున్నీరుగా ఎడ్చిన విషయం తెలుసుకున్న .. ఆయన కొడుకు వైఎస్ జగన్ ఓదార్చటం జరిగింది. ఇక్కడే జగన్ పెద్ద తప్పు చేయటం జరిగిందని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.
వైఎస్ జగన్ ఓదార్పు .. రోజా కు ప్రాణం పోసింది. మళ్లీ వికసించేలా చేసింది. దీంతో జగన్ పార్టీలో చేరి, ప్రత్యర్థులను ముళ్లుతో గుచ్చటం జరిగింది. రోజాకు .. మరో ఐరన్ లెగ్ లేడీ గా ముద్ర పడ్డ ‘లక్ష్మీ పార్వతి’ తొడైంది.దీంతో జగన్ పార్టీకి మంచి బలం ఉందని ఆ పార్టీ నేతలు అప్పుడు అనుకున్నారు. కానీ ఇప్పడు లబోదిబోమని ఏడుస్తున్నారు.
రోజా, లక్ష్మీ పార్వతిలకు ఓటమి తెప్పితే.. గెలుపు అనేది తెలియదు. అలాంటిది రోజా కు గెలుపు దక్కటంతో..వైఎస్ జగన్ పార్టీ ఓటమి పాలైందని ఆ పార్టీలోని సీనియర్ నేతలు అంటున్నారు. చంద్రబాబువద్ద రోజా ఉన్నంత కాలం ఆయనకు అధికారం దూరమైన విషయాన్ని వారు గుర్తు చేసుకున్నట్లు సమాచారం. రోజా గెలుపే జగన్ కు శాపమైందని కొంతమంది సిద్దాంతులు జగన్ కు చెప్పినట్లు ఆపార్టీలోకి కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
ఈరోజు పులివెందలలోని ఇడుపులపాయాలో.. వైసీపీ నేతలు సమావేశం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీలోని సీనియర్ నాయకులు, మహిళ నేతలు రోజా గెలుపు విషయం పై మాట్లాడటానికి సిద్దంగా ఉన్నట్లు ఆ పార్టీలో కార్యకర్తలు అంటున్నారు.
రోజా మాత్రం నా గెలుపు పైనుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి తనను ఆశీర్వదించారని, ఆయన ఆశీస్సులు తనకు ఉన్నాయని రోజా అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలన్ని ఏకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కుట్ర చేశాయని అంటున్నారు. కానీ వైసీపీ నేతల మాత్రం మరోలా చెబుతున్నారు. రోజా విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది వేచి చూద్దాం.
కొసమెరుపు: బైబిల్ నమ్మే వారికి .. ఇలాంటి సిద్దంతాలు ఉంటాయా? అంతా ప్రభు దయ అని జగన్ సన్నిహితులు అంటున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆ జీసస్ తప్పకుండా రక్షిస్తాడని , పార్టీ గెలుపు కోసం ప్రత్యేక ప్రార్థనాలు చేయటానికి అనిల్ బ్రదర్ ఆద్వర్యంలో జరుగుతున్నట్లు సమాచారం.
రోజా గెలుపుతో .. విజయమ్మ ఓటమి? వైసీపీ ఓటమి, బాలినేని శ్రీనివాసరావు ఓటమి? ఇలాంటివి ఆ పార్టీలో చాలా జరిగినట్లు వైసీపీ కార్యకర్తలు గుసగుసగలాడుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more