మండపేట ఆంటీ ఎవరు కొత్తగా ? అనే సందేహం రానీయకండి. అదేనండి మన హేమా ఆంటీ. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేమ ఆంటీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నకల్లో తన అద్రుష్టాన్ని పరీక్షించుకోవడానికి సీమాంధ్రలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన ‘జైసమైక్యాంధ్ర పార్టీ ’ తరుపున మండపేట నియోజక వర్గ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అలా మండపేట ఆంటీ అయ్యింది ఈ హేమ ఆంటీ.
చాలా మంది నటీ, నటులు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తుంటే తానెందుకు రాకూడదు అనుకుందో ఏమో ఉన్నట్లుండి రాజకీయ అరంగ్రేటం చేసి, జైసపా పార్టీ నుండి ‘చెప్పు ’ గుర్తు పై పోటీ చేసింది. వెండి తెర పై తన నటనతో, సెక్సీ అప్పీల్ తో ప్రేక్షకుల్ని అలరించే హేమ ఎన్నికల ప్రచారంలో కూడా అలా కవ్విస్తే ఓట్లు రాలుతాయనుకుందో ఏమో ఎన్నికల్లో మండే ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహించింది.
ఈమె చూడటానికి మండపేట నియోజక వర్గ ప్రజలు మండే ఎండల్లో సైతం వచ్చారు కానీ ఓట్లు మాత్రం వేయలేదు. ఈమెకు డిపాజిట్ కూడా రాకుండా ‘చెప్పు ’ తో కొట్టినంత పని చేశారు. ఫలితాల తరువాత సినీ జనాలు హా హా హా అని నవ్వుకుంటూ మండపేట ఆంటీ దూల తీర్చారని జోకులు వేసుకుంటున్నారు. సినీ గ్లామర్ తో వచ్చి రాజకీయాల్ని ఏలేద్దాం అనుకుంటే కష్టం అని ఇప్పటికైనా ఆంటీకి అర్థమయ్యి ఉంటుందంటారా ?
Knr
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more