తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా, పదేళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి 2014 ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు పట్టం కట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రపద్రేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న బాబు పై సోషల్ మీడియాలో ‘నాయుడు ఈజ్ బ్యాక్ ’’ అనే క్యాన్షన్ తో విషెష్ చెబుతున్నారు. దానికి ధీటుగా కొంత మంది ‘‘ రెడ్డి బ్యాక్ టు జైల్ ’’ అంటూ ప్రచారం చేస్తున్నారు.
చంద్రబాబు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు అవినీతి పరుల అంతు చూస్తామని, తాము అధికారంలోకి వస్తే అవినీతి పరుల్ని జైళ్ళకు పంపడమే కాకుండా, వారి ఆస్తుల్ని జప్తు చేసి పేదలకు పంచుతామని చెప్పాడు. సీమాంధ్రలో బాబు అధికారం చేపట్టబోతుంటే అక్కడ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న వైయస్సార్ పార్టీ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని గతంలో జైలు జీవితాన్ని గడిపి, బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
సీమాంధ్రలో ఎలాగైనా అధికారంలోకి వస్తామని మొన్నటి వరకు ధీమాగా వైయస్సార్ సీపీ నాయకులు ఇప్పుడు ఓటమి బాధలో కుంగిపోతుంటే బాబు అదికారం చేపట్టిన తరువాత పాత కేసుల్ని తవ్వి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతను, పార్టీలో అవినీతికి పాల్పడిన నేతల్ని గ్యారెంటీగా జైళ్ళకు పంపడం కనిపిస్తుంది త్వరలో అధికారం చేపట్టబోతున్న తెలుగుదేశం పార్టీ నాయకుల మాటల్ని బట్టి.
ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ రాణించలేదనీ, అసలు వైఎస్సార్ కాంగ్రెస్ ఉనికి అనేదే ప్రశ్నార్థకమని ప్రస్తుత అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానించడం చూస్తుంటే సాధ్యమైనంత తొందర్లో పాత కేసుల్ని తెర పైకి తెచ్చి జగన్ ని జైల్లో తోయడం ఖాయంగా కనిపిస్తుంది. అదే గనుక జరిగితే... తమిళనాడులో జయకు, కరుణానిధికి మధ్య లాగా రివేంజ్ రాజకీయాలు మన ఎపీలో తెరలేవడం ఖాయం అంటున్నారు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో???
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more