పట్టుమని పది వారాలు కూడా జనసేన పార్టీకి నిండాలేదు. కానీ అపార రాజకీయ అనుభవం కలిగిన రాజకీయ నేతలు , ‘నాయుడు’ సైతం వణికిపోతున్నారు. ఇప్పడు ఈ విషయం ఆ వర్గంలోని చోట నాయకుల దగ్గర నుండి భాడానేతల వరకు హాట్ చర్చగా మారింది.
మన పార్టీ ప్రచారం కోసం ఎవర్ని బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదని ఇటీవల పచ్చ చొక్క కొత్త నాయకుడు ఎన్నికల ప్రచారంలో డైలాగ్ పేల్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ డైలాగ్ ఇంటి వారికి, బయటి వారికి వర్తిస్తుందని పార్టీ కార్యకర్తలు చెవులుకొరుక్కున్నారు.
అలాంటిది ‘నాయుడు’ షరతులను తుంగలో తొక్కి , పార్టీ కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ ఇంటికి వెళ్లి తేనీటి విందు ఆరగించి, ఎన్నికల ప్రచారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు కోరటం జరిగింది. సరిగ్గా ఇక్కడే.. పార్టీలో అసలు యుద్దం మొదలైంది. జనసేన పార్టీ పురుడు పోసుకొని కొన్ని రోజులు అవుతుంది. అలాంటిది మూడు పదుల వయసు దాటిన పార్టీ రాజకీయ అనుభవం ఏమైందని ‘నాయుడ్ని ’కొంత మంది సీనియర్ నాయకులు అడుగుతున్నారు.
తన సొంత మేనల్లుడైన జూనియర్ ఎన్టీఆర్ ను పిలవటానికి నాయుడికి సమయం దొరకలేదు గానీ, పవన్ కళ్యాణ్ ను పిలవటానికి సమయం ఎలా దొరికిందని, ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. జనసేన అంటే జాతీయ నాయుకుడు మోడీ, రాష్ట్ర నేత ‘నాయుడు ’ సైతం ఎందుకు వణికిపోతున్నారో అర్థం కావటంలేదని పార్టీకార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
ఒక వేళ జూనియర్ రాకతో ఎక్కడ నాయుడు కొడుకు, తన అల్లుడు నారా లోకేష్ కు చెక్ పడుతుందోనని భయపడుతున్న బాలయ్య ఎన్నికల ప్రచారం లో సొంతవారిపై కామెంట్ చేయటం జరిగింది. అసలు
నిజానికి పవన్ కళ్యాణ్ ‘నాయుడు ’ కు అంత సీన్ ఉందా? పవన్ కు నాయుడు అంత సీన్ ఎందుకు ఇచ్చాడు? అన్న విషయం మీద రాజకీయ మేథావులు కూడా తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఏమైన పిల్లి గడ్డం చంద్రబాబు.. తెల్ల గడ్డం నరేంద్ర మోడీలను పవన్ కళ్యాణ్ ఏదో మాయ చేశాడని ఆపార్టీ కార్యకర్తలు నాయుడ్ని సమర్థించుకుంటూ .. ఎన్నికల ప్రచారంలో సాగిపోతూ.. జై తెలుగుదేశం, జై చంద్రబాబే , జై పవన్ కళ్యాణ్, జై బాలయ్య, జై లోకేష్.., జై... జై నరేంద్ర మోడీ అంటూ ముందు నడుస్తున్నారు.
అయినా .. పవన్ పార్టీ పెట్టిన, జనసేన పార్టీ సపోర్టు తీసుకున్న, నరేంద్ర మోడీ పక్కన నాయుడు కూర్చుకున్న అంత తెలుగు ప్రజల అభివ్రుద్ది కోసమే అని విషయం మరిచిపోకండి? ఇకనైన ..సొంత రాజకీయాలు మానుకొని..తెలుగు ప్రజలు అభివ్రుద్ది వైపు అడుగులు వేద్దాం రండి...?
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more